AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య తీర్పుపై దేశ ప్రజలకు మోదీ అభ్యర్థన..

వివాదస్పద అయోధ్య భూవివాదంపై శనివారం ఉదయం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ  నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించి.. శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.  అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు ప్రధాని. కోర్టు తీర్పు వెలువడిన కూడా శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. ‘అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఎవరికీ […]

అయోధ్య తీర్పుపై దేశ ప్రజలకు మోదీ అభ్యర్థన..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 09, 2019 | 10:43 AM

Share

వివాదస్పద అయోధ్య భూవివాదంపై శనివారం ఉదయం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ  నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించి.. శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.  అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు ప్రధాని. కోర్టు తీర్పు వెలువడిన కూడా శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మోదీ.

‘అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఎవరికీ ఓటమి కూడా కాదు. ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలి. దేశ ప్రజలంతా శాంతి, సోదరభావంతో మెలగాలని కోరుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక – సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్‌ దేశం అంతా కలసిమెలసి నిలబడదామని’ మోదీ పేర్కొన్నారు.