AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలారు, టీడీపీ తుడిచిపెట్టుకుపోతోందన్న భయంతోనే కుట్ర : మంత్రి బాలినేని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం పైకి దొంగలను వదిలాడని, వీళ్లు దేవుడి విగ్రహాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని..

చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలారు, టీడీపీ తుడిచిపెట్టుకుపోతోందన్న భయంతోనే కుట్ర : మంత్రి బాలినేని
Venkata Narayana
|

Updated on: Jan 10, 2021 | 3:31 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం పైకి దొంగలను వదిలాడని, వీళ్లు దేవుడి విగ్రహాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. టీడీపీ నేతలంతా వైసీపీలోకి వస్తుండడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడని మంత్రి విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని బాలినేని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నారని.. ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని బాలినేని చెప్పుకొచ్చారు.