AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్.. కొడితే దిమ్మ తిరగాల్సిందే!

రాజధాని తరలింపు అంశాన్ని తెరమీదికి తెచ్చి ఏపీవ్యాప్తంగా సంచలన సీఎంగా పేరు సాధించిన ముఖ్యమంత్రి జగన్ తదుపరి లక్ష్యం కూడా ఫిక్స్ అయ్యింది. మూడు అంశాల ఆధారంగా నెక్స్ట్ టార్గెట్‌ని ఫిక్స్ చేసిన సీఎం.. దానిపై అధికారులకు కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే ఇక మడమ తిప్పేది లేదన్న సంకేతాలను బలంగా పంపుతున్న జగన్.. సరికొత్త టార్గెట్‌కు కూడా ఇలాగే యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి అత్యంత […]

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్.. కొడితే దిమ్మ తిరగాల్సిందే!
Rajesh Sharma
|

Updated on: Dec 27, 2019 | 6:23 PM

Share

రాజధాని తరలింపు అంశాన్ని తెరమీదికి తెచ్చి ఏపీవ్యాప్తంగా సంచలన సీఎంగా పేరు సాధించిన ముఖ్యమంత్రి జగన్ తదుపరి లక్ష్యం కూడా ఫిక్స్ అయ్యింది. మూడు అంశాల ఆధారంగా నెక్స్ట్ టార్గెట్‌ని ఫిక్స్ చేసిన సీఎం.. దానిపై అధికారులకు కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే ఇక మడమ తిప్పేది లేదన్న సంకేతాలను బలంగా పంపుతున్న జగన్.. సరికొత్త టార్గెట్‌కు కూడా ఇలాగే యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు.

శుక్రవారం ఉదయం నుంచి అత్యంత హైప్ క్రియేట్ చేసిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో రాజధాని అంశంపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో అంతా ఊసూరుమన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన మరో రివ్యూ మీటింగ్‌లో సీఎం జగన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంతే పక్కాగా అధికారులకు తన నిర్ణయం అమలు బాధ్యతలను అప్పగించారు. మూడంచెల విధానంతో తన నిర్ణయాన్ని అమలు చేయాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, ఇతర ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణలపై సీఎం సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో మూడు ప్రధాన విషయాల్లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించాలని జగన్ ఆదేశించారు. తొలి అడుగులో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని తలపెట్టారు. మలి అడుగులో ప్రతీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. కీలకమైన మూడో అడుగులో ప్రైవేటు పాఠశాలల్లోని ఫీజులను పూర్తిగా నియంత్రణలోకి తేవాలని సీఎం నిర్దేశించారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లలో ఫీజులను నియంత్రించేందుకు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు.

రాష్ట్రంలో స్కూలు ఫీజులు సాధారణ స్థాయిలో లేవని, ఫీజుల జాబితాలను చూస్తే షాక్ కొట్టే పరిస్థితి వుందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్కూళ్లు తెలుగు మీడియంలో ఉన్నందు వల్ల పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రులు వారిని అధిక ఫీజులు చెల్లించి మరీ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చేర్పిస్తున్నారని చెప్పుకొచ్చారు సీఎం. ఇంగ్లీషు మీడియం చదువుల కోసం పేరెంట్స్ విపరీతంగా ఖర్చుపెడుతున్నారని, పిల్లలకు మనం ఇంగ్లీషు మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని అన్నారాయన.