AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android Phones: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయలేదా? గూగుల్‌ మీకో వార్నింగ్‌..!

Android Phones: తమ స్మార్ట్‌ఫోన్‌లను వెంటనే ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అప్‌డేట్ చేసుకోవాలని, అప్‌డేట్ చేయలేని పాత మోడల్ ఫోన్‌లను మార్చడం సురక్షితమని సూచించింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఫోన్‌ల పనితీరుకు మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ముఖ్యమైన భద్రతా కవచం కూడా..

Android Phones: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయలేదా? గూగుల్‌ మీకో వార్నింగ్‌..!
Android Phones
Subhash Goud
|

Updated on: Feb 08, 2026 | 9:55 PM

Share

Cyber Security Warning: పాత ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్‌లలో అమలు చేసే వినియోగదారులకు గూగుల్ గట్టి భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ 13 లేదా అంతకు ముందు వెర్షన్‌లతో నడుస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం తీవ్రమైన సైబర్ దాడులను ఎదుర్కొంటున్నాయని గూగుల్ తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌కు పైగా ఆండ్రాయిడ్ ఫోన్‌లు మాల్వేర్, స్పైవేర్, రాన్సమ్‌వేర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది.

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయని ఫోన్‌లు ప్రమాదంలో..

గూగుల్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం పాత సాఫ్ట్‌వేర్‌లపై నడుస్తున్నాయి. ఫలితంగా ఈ పరికరాలు క్రమం తప్పకుండా భద్రతా అప్‌డేట్‌లను అందుకోవడం లేదు. హ్యాకర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారని, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: EPFO Alert: తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌!

ఇంతలో గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ను విడుదల చేయగా, ఇప్పటివరకు 7.5 శాతం మంది మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. కొందరు ఆండ్రాయిడ్ 15 ను అప్‌డేట్ చేయకుండానే ఉపయోగిస్తున్నారు. కానీ ఒక బిలియన్ కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికీ ఆండ్రాయిడ్ 13 లేదా అంతకు ముందు అప్‌డేట్‌లను మాత్రమే ఉపయోగిస్తున్నాయనే గూగుల్‌ చెబుతోంది.

హ్యాకర్ల ప్రమాదం:

భద్రతా అప్‌డేట్‌లు అప్‌డేట్‌లు లేకుండా హ్యాకర్లు సులభంగా ఫోన్‌లలోకి చొరబడవచ్చు. అలాగే వినియోగదారుల సందేశాలు, కాల్‌లు, సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకింగ్ యాప్‌లను పర్యవేక్షించవచ్చు. కొన్ని సందర్భాల్లో రాన్సమ్‌వేర్ దాడులు మొత్తం ఫోన్‌ను నియంత్రించవచ్చని, డేటాను లాక్ చేయగలవని, చెల్లింపును డిమాండ్ చేయవచ్చని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gold Rate: భారత్‌ కంటే ఈ 5 దేశాలలో అతి తక్కువ ధరకే బంగారం.. ఆ దేశాలు ఏంటో తెలుసా?

ప్రస్తుతం దాదాపు 58 శాతం ఆండ్రాయిడ్ ఫోన్‌లు మాత్రమే సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు. మిగిలిన 42 శాతం ఫోన్‌లు సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ 13కి ముందు అప్‌డేట్‌లను ఉపయోగించే వినియోగదారులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

దీనిని నివారించడానికి గూగుల్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లను వెంటనే ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అప్‌డేట్ చేసుకోవాలని, అప్‌డేట్ చేయలేని పాత మోడల్ ఫోన్‌లను మార్చడం సురక్షితమని సూచించింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఫోన్‌ల పనితీరుకు మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ముఖ్యమైన భద్రతా కవచం కూడా అని కంపెనీ నొక్కి చెప్పింది.

Silver Price: భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి