AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సచివాలయాన్ని వీడని కరోనా.. 38కి చేరిన కేసుల సంఖ్య..

ఏపీ సచివాలయాన్ని కరోనా మహమ్మారి వదలటం లేదు. సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్‌లో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఏపీ సచివాలయాన్ని వీడని కరోనా.. 38కి చేరిన కేసుల సంఖ్య..
Ravi Kiran
|

Updated on: Jul 10, 2020 | 2:53 PM

Share

ఏపీ సచివాలయాన్ని కరోనా మహమ్మారి వదలటం లేదు. సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్‌లో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తోటి ఉద్యోగులు తీవ్ర భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు.

తాజా కేసులతో కలుపుకుని సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగుల్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఇదిలా ఉంటే, ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. రాష్ట్రం లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 25,422కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11, 936 కాగా, 13,194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 292కి చేరింది.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..

ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!

గుంటూరులో కరోనా టెర్రర్.. నేటి నుంచి కొత్త నిబంధనలు..

కేంద్రం సంచలన నిర్ణయం.. వలస కూలీల కోసం అద్దె ఇళ్లు..!