వారంతా కంపార్ట్మెంటల్లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో విద్యార్ధుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఇంటర్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెయిన్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన విద్యార్ధులందరూ కంపార్ట్మెంటల్లో పాస్ అయినట్లు పేర్కొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ వెల్లడించారు. ఫెయిల్ అయిన విద్యార్ధులందరికీ కూడా ప్రతీ సబ్జెక్ట్లోనూ పాస్ మార్కులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఫస్టియర్ పరీక్షల్లో మార్కులు […]

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో విద్యార్ధుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఇంటర్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెయిన్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన విద్యార్ధులందరూ కంపార్ట్మెంటల్లో పాస్ అయినట్లు పేర్కొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ వెల్లడించారు.
ఫెయిల్ అయిన విద్యార్ధులందరికీ కూడా ప్రతీ సబ్జెక్ట్లోనూ పాస్ మార్కులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఫస్టియర్ పరీక్షల్లో మార్కులు ఇంప్రూవ్మెంట్ కోరుకున్న విద్యార్ధులకు 2021 మార్చిలో మరో ఛాన్స్ ఇస్తామన్నారు. అప్పుడు సెకండియర్ విద్యార్ధులతో పాటు మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
Also Read:
తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్లో 30% కోత.!
భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..