ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ముహూర్తం ఫిక్స్.! 4వేల 762 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు

ఏపీ వాసులకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగానే కనిపిస్తోంది. ఈ నెల 25 నుంచి కోటి మందికి టీకా పంపిణీ..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ముహూర్తం ఫిక్స్.! 4వేల 762 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు
Covid-19 vaccine wastage
Follow us

|

Updated on: Dec 16, 2020 | 10:34 AM

ఏపీ వాసులకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగానే కనిపిస్తోంది. ఈ నెల 25 నుంచి కోటి మందికి టీకా పంపిణీ చేస్తామని ట్వట్టర్ వేదికగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే జగన్‌ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆదేశాల ప్రకారమే 4వేల 762 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణికి ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు సమాచారం. అయితే, అనౌన్స్‌మెంట్‌ బాగానే ఉంది. కానీ ఏ టీకా ఇస్తారు. ఈ ప్రశ్నలో నుంచే ఆన్సర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఫైజర్‌, భారత్‌బయోటెక్‌ వ్యాక్సిన్‌లకు ఎమర్జెన్సీ యూసేజ్‌కి కేంద్రం ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అంటే కేంద్రం రాష్ట్రాలకు ఏమైనా సూచాయిగా చెప్పిందా. ! ఏ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి రాబోతోందో రాష్ట్రాలకు ముందే తెలుసా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఒకవేళ ఫైజర్‌కు అనుమతిస్తే టీకా ఖరీదు 2వేల 5వందల రూపాయల వరకూ ఉంటుందంటున్నారు. అదే సీరమ్ ప్రపోజ్ చేస్తున్న రేటయితే 250 రూపాయలు ఉండొచ్చంటున్నారు. మరి కేంద్రం ఓకే చెప్పేది ఏ వ్యాక్సిన్‌కి. ఏపీకి ఏ వ్యాక్సిన్ రాబోతోంది. వచ్చినా ఫ్రీగా ఇస్తారా లేక.. ఏమైనా చార్జ్ చేస్తారా.. తెలియాల్సి ఉంది.