AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా అంత్యక్రియలకు నా విరాళం.. ఓ అనాథ కన్నీటి గాథ

అతడు ఒక అనాథ.. జీవితం మీద విరక్తి పుట్టింది. చనిపోవాలి అనుకున్నాడు. కాని.. తను చనిపోతే అంతక్రియలు ఎవరు చేస్తారు.? అనాథ శవాన్ని ఎవరు పట్టించుకోరు కదా.? అందుకే ముందుగానే తన అంత్యక్రియలకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే సర్వ్ నీడి అనే స్వచ్ఛంద సంస్థకు రూ.6 వేలు ఇచ్చాడు. సంస్థ నిర్వాహకులు అతడు విరాళం ఇస్తున్నాడని అనుకున్నారు. కాని ఆ తర్వాత రెండు రోజులకే అతను చనిపోయాడు. దీంతో వారు షాక్ […]

నా అంత్యక్రియలకు నా విరాళం.. ఓ అనాథ కన్నీటి గాథ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 26, 2019 | 11:34 AM

Share

అతడు ఒక అనాథ.. జీవితం మీద విరక్తి పుట్టింది. చనిపోవాలి అనుకున్నాడు. కాని.. తను చనిపోతే అంతక్రియలు ఎవరు చేస్తారు.? అనాథ శవాన్ని ఎవరు పట్టించుకోరు కదా.? అందుకే ముందుగానే తన అంత్యక్రియలకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే సర్వ్ నీడి అనే స్వచ్ఛంద సంస్థకు రూ.6 వేలు ఇచ్చాడు. సంస్థ నిర్వాహకులు అతడు విరాళం ఇస్తున్నాడని అనుకున్నారు. కాని ఆ తర్వాత రెండు రోజులకే అతను చనిపోయాడు. దీంతో వారు షాక్ అయ్యారు. అతను ఇచ్చిన డబ్బుతో అంత్యక్రియలు నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా గాంధీనగర్ తండాకు చెందిన బొంతు విజయ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగోట్టుకున్న అతడు.. అనాథ లాగే జీవిస్తున్నాడు. తనకంటూ ఎవరూ లేకపోవడంతో.. జీవితం పై విరక్తి పుట్టి చనిపోవాలనుకున్నాడు. అనాథ శవం అని ఎవరూ పట్టించుకోరేమోనని.. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే స్వచ్చంధ సంస్థలకు రూ. 6 వేలు విరాళంగా చెల్లించాడు. ఆ తరువాత రెండు రోజులకు బేగంపేట రైల్వేస్టేషన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. జీవితం పై విరక్తి పుట్టి చనిపోతున్నానని.. నా అంత్యక్రియలు నిర్వహించండి. తన పెద్దమ్మ కుమారుడైన సందీప్‌కు తను చనిపోయినట్లు చెప్పమని సూసైడ్ లెటర్ రాశాడు. సూసైడ్ నోటును గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు.. సర్వ్ నీడి సంస్థ ద్వారా అతడి అంత్యక్రియలు జరిపించారు.