ముంబై సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 5గురు మృతి!

ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో.. పాల్ఘర్ లోని ఏఎన్‌కే ఫార్మా అనే సంస్థకు చెందిన కర్మాగారంలో జరిగిన పేలుడులో ఐదుగురు మరణించారు, పలువురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సేవా అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఏఎన్‌కే ఫార్మా అనే సంస్థకు చెందిన అండర్ కన్స్ట్రక్షన్ ప్లాంట్ బోయిసర్ లోని కొల్వాడే గ్రామంలో ఉంది. ఇది మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ […]

ముంబై సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 5గురు మృతి!
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 11:35 PM

ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో.. పాల్ఘర్ లోని ఏఎన్‌కే ఫార్మా అనే సంస్థకు చెందిన కర్మాగారంలో జరిగిన పేలుడులో ఐదుగురు మరణించారు, పలువురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సేవా అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఏఎన్‌కే ఫార్మా అనే సంస్థకు చెందిన అండర్ కన్స్ట్రక్షన్ ప్లాంట్ బోయిసర్ లోని కొల్వాడే గ్రామంలో ఉంది. ఇది మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి) ప్రాజెక్టు కిందకు వస్తుంది. రాత్రి 7:20 గంటల సమయంలో జరిగిన ఈ పేలుడు తీవ్రత 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

[svt-event date=”11/01/2020,11:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Latest Articles