AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దపల్లి జిల్లా‌లో ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి గాయాలు

పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను-ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. బాధితులు వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గుళ్లబుద్దారం గ్రామానికి చెందిన అజ్మిరా రాజేందర్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం వేములవాడకు దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న వాహనం పెద్దపల్లి సమీపంలోని మంథని రైల్వే గేటు వద్ద మలుపు తిరుగుతుండగా గోదావరిఖని నుంచి పెద్దపల్లి వైపు […]

పెద్దపల్లి జిల్లా‌లో ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి గాయాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 12, 2020 | 12:15 AM

Share

పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను-ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. బాధితులు వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గుళ్లబుద్దారం గ్రామానికి చెందిన అజ్మిరా రాజేందర్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం వేములవాడకు దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న వాహనం పెద్దపల్లి సమీపంలోని మంథని రైల్వే గేటు వద్ద మలుపు తిరుగుతుండగా గోదావరిఖని నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. క్షతగాత్రుల్లో అజ్మిరా రమేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పెద్దపల్లి ఎస్సై తెలిపారు.