AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెఎన్‌యు దాడి నిందితుల గుట్టు రట్టు చేసిన వాట్సాప్!

‘యూనిటీ ఎగెనెస్ట్ లెఫ్ట్’ అనే వాట్సాప్ గ్రూపులోని 60 మంది సభ్యులలో 37 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు, వీరికి గత వారం జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన ముసుగు గూండాల దాడితో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో 10 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు కాదు. వీరు హింసాకాండతో సంబంధం ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలు, బిజెపి-అనుసంధానమైన ఎబివిపి (అఖిల్ భారతీయ విద్యా పరిషత్) కు చెందినవారు. ఈ బయటి వ్యక్తులను క్యాంపస్‌లోకి […]

జెఎన్‌యు దాడి నిందితుల గుట్టు రట్టు చేసిన వాట్సాప్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 11, 2020 | 11:24 PM

Share

‘యూనిటీ ఎగెనెస్ట్ లెఫ్ట్’ అనే వాట్సాప్ గ్రూపులోని 60 మంది సభ్యులలో 37 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు, వీరికి గత వారం జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన ముసుగు గూండాల దాడితో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో 10 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు కాదు. వీరు హింసాకాండతో సంబంధం ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలు, బిజెపి-అనుసంధానమైన ఎబివిపి (అఖిల్ భారతీయ విద్యా పరిషత్) కు చెందినవారు. ఈ బయటి వ్యక్తులను క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి జెఎన్‌యు విద్యార్థులు సహకరించారని పోలీసులు తెలిపారు. గుర్తించిన 37 మంది వ్యక్తులలో ఒకరు జెఎన్‌యు కు చెందిన ఎబివిపి యూనిట్ కార్యదర్శి మనీష్ జంగిద్.

ఈ ఉదయం జెఎన్‌యు వైస్ ఛాన్సలర్ జగదీష్ కుమార్ దాడి జరిగిన తరువాత మొట్ట మొదటిసారిగా విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇది ఒక సమస్య … చాలా మంది అక్రమ విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారు. వారు బయటి వ్యక్తులు కావచ్చు, వారు ఏదైనా హింసలో పాల్గొనవచ్చు, ఎందుకంటే వారికి విశ్వవిద్యాలయంతో సంబంధం లేదు” అని ఆయన తెలిపారు. వైస్ ఛాన్సలర్ హాస్టళ్ల వెలుపల సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు.

ఈ వారం ప్రారంభంలో జనవరి 5న జరిగిన దాడిని వైస్ ఛాన్సలర్ దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. దీనిని ఆపడానికి పోలీసులు ఏమీ చేయలేదని ఆరోపించారు – జనవరి 5 న క్యాంపస్‌లో హింస చెలరేగినప్పటి నుండి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ దాడిలో జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు ఐషే ఘోష్‌ గాయపడ్డారు.

సిసిటివి ఫుటేజ్ లేకపోవడం నిందితులను గుర్తించడంలో పెద్ద అడ్డంకి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గత వారం వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టుల స్క్రీన్ షాట్లను కూడా అధ్యయనం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

ఘోష్‌పై ఢిల్లీ పోలీసులు ఇంతకుముందు రెండు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేశారు. ఆదివారం సాయంత్రం, అర్థరాత్రి జరిగిన హింసకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే దాఖలైంది, ఇందులో 70 నుంచి 100 మంది ముసుగు గూండాలు ఇనుప రాడ్లు, స్లెడ్జ్ హామర్లు, విరిగిన గాజు సీసాలతో జెఎన్ యు క్యాంపస్ పైకి దూసుకెళ్లారు. ఇదిలావుండగా, ముగ్గురు జెఎన్‌యు ప్రొఫెసర్లు సిసిటివి ఫుటేజ్, వాట్సాప్ మెసేజ్‌లతో సహా సాక్ష్యాలను భద్రపరచాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.