విషాదంగా ముగిసిన హనీమూన్.. నవవరుడు దుర్మరణం!
హనీమూన్ కోసం చెన్నై నుంచి హిమాచల్ వెళ్లిన ఆ నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. భార్య కళ్లెదుటే భర్త ప్రమాదంలో కన్నుమూయడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషాద ఘటన హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో చోటుచేసుకుంది. చెన్నై నగరానికి చెందిన అరవింద్ (27)కు ప్రీతి అనే యువతితో గత వారం వివాహమైంది. కొత్తజంట హనీమూన్ కోసం హిమాచల్ప్రదేశ్లోని మనాలికి వెళ్లారు. ఈ క్రమంలో వారు డోబీ అనే ప్రాంతాన్ని సందర్శించారు. అది పారాగ్లైడింగ్కు ప్రసిద్ధి. తను కూడా […]
హనీమూన్ కోసం చెన్నై నుంచి హిమాచల్ వెళ్లిన ఆ నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. భార్య కళ్లెదుటే భర్త ప్రమాదంలో కన్నుమూయడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషాద ఘటన హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో చోటుచేసుకుంది.
చెన్నై నగరానికి చెందిన అరవింద్ (27)కు ప్రీతి అనే యువతితో గత వారం వివాహమైంది. కొత్తజంట హనీమూన్ కోసం హిమాచల్ప్రదేశ్లోని మనాలికి వెళ్లారు. ఈ క్రమంలో వారు డోబీ అనే ప్రాంతాన్ని సందర్శించారు. అది పారాగ్లైడింగ్కు ప్రసిద్ధి. తను కూడా పారాగ్లైడింగ్ చేస్తానని చెప్పడంతో ప్రీతి సరేనంది. దీంతో సోమవారం పైలట్ హరూరామ్తో కలిసి అరవింద్ గాల్లో విహరించాడు.
అయితే నడుముకు కట్టుకున్న బెల్ట్ విడిపోవడంతో ప్రీతి చూస్తుండగానే ఒక్కసారిగా కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. అతడితో విహరించిన పైలట్ హరూరామ్ కూడా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని హరూరామ్ను ఆస్పత్రికి తరలించారు. అరవింద్ మృతదేహాన్ని కులు హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తన కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ప్రీతి కన్నీరుమున్నీరవుతోంది.