AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం

తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2020 | 12:12 AM

Share

Coronavirus In Telangana: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 331 మంది చనిపోయారు. మొత్తం 30,946 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 12,423 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం 913 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 18,192 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.

కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 918 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డిలో 79, ఖమ్మంలో 12, కామారెడ్డిలో 2, వరంగల్ అర్బన్‌లో 34, వరంగల్ రూరల్‌లో 7, కరీంనగర్‌లో 32, జగిత్యాలలో 1, యాదాద్రిలో 2, మహబూబాబాద్‌లో 5, పెద్దపల్లిలో 1, మెదక్‌లో 17, మహబూబ్‌నగర్‌లో 8, భద్రాద్రి కొత్తగూడెంలో 23, జయశంకర్ భూపాలపల్లిలో 6, నల్గొండలో 21, రాజన్న సిరిసిల్లలో 8, ఆదిలాబాద్‌లో 1, వికారాబాద్‌లో 5, జనగాంలో 2, నిజామాబాద్‌లో 18, ములుగులో 1, వనపర్తిలో 2, సిద్దిపేటలో 1, సూర్యాపేటలో 10, గద్వాల్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి.

Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..