AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ కౌంట్ డౌన్ స్టార్టయింది

ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020 కౌంట్ డౌన్ స్టార్టయింది. కొవిడ్ 19 నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ టోర్నమెంట్ జరుగబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ మంచి ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఐపీఎల్ కౌంట్ డౌన్ స్టార్టయింది
Anil kumar poka
|

Updated on: Sep 18, 2020 | 1:22 PM

Share

ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020 కౌంట్ డౌన్ స్టార్టయింది. కొవిడ్ 19 నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ టోర్నమెంట్ జరుగబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ మంచి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఐపీఎల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో శనివారం నుండి ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు దుబాయ్ లోనూ సందడి వాతావరణం నెలకొంది. ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగబోతోంది. ఇలా ఉంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ ఈ సీజన్ కోసం యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా, యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ కార్తీక్ మెయప్పన్‌తో డీల్ కుదర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి వీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో యూఏఈలో ఆసీస్ పర్యటించినప్పుడు రజా స్పిన్ సలహాదారుడిగా పనిచేశాడు. యూఏఈ పిచ్‌లపై అన్ని స్థాయిల క్రికెట్ ఆడిన అనుభవం రజాకు ఉంది. ఎడమ చేతివాటం స్పిన్నర్ అయిన రజా అనుభవం ఆర్సీబీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.