State Bank of India: 10వేల కంటే ఎక్కువ నగదును విత్డ్రా చేస్తున్నారా.. ఇకపై కొత్త రూల్ తప్పనిసరి!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులనుద్దేశించి తాజాగా రెండు కీలక ప్రకటన చేసింది. నగదు లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలను తెలిపింది.
State Bank of India New ATM rule: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులనుద్దేశించి తాజాగా రెండు కీలక ప్రకటన చేసింది. నగదు లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలను తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో ఆ వివరాలను పొందుపరిచింది. ATM నుండి రూ. 10,000 కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేసుకునే వారి కోసం ఈ ప్రకటన చేసింది ఎస్బీఐ. కొత్త నిబంధన ప్రకారం, మీరు 10 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని విత్డ్రా చేస్తే, దాని కోసం OTP తీసుకోవలసి ఉంటుంది. OTP వినియోగించడం ద్వారా మోసానికి తక్కువ అవకాశం ఉంటుందని, కాబట్టి OTP ఉత్తమ ఉపసంహరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
నిజానికి బ్యాంకుల లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్బీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ OTP సదుపాయం ప్రయోజనాన్ని పొందగలిగే స్టేట్ బ్యాంక్ కస్టమర్లు సురక్షితంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అటువంటి సేవను ప్రకటిస్తుంది. తద్వారా వారి లావాదేవీలు సురక్షితంగా సులభంగా డబ్బులు తీసుకోవచ్చు. OTP ద్వారా డబ్బు విత్ డ్రా చేయడం కూడా అందులో భాగమే. ఇందు కోసం, బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ మీ వద్ద ఉండాలి. దానిపై OTP వస్తుంది. మీరు అదే OTP ద్వారా డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు.
ATM నుండి నగదు ఉపసంహరణను ధృవీకరించడానికి లేదా ప్రామాణీకరించడానికి ఈ నియమం రూపొందించడం జరిగింది. ఇది కస్టమర్ల డబ్బుకు భద్రతను పెంచుతుంది. డబ్బు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా చేస్తుంది. OTP ఆధారిత నగదు లావాదేవీలు 10 వేలకు పైబడిన మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. మీరు అంతకంటే తక్కువ విత్డ్రా చేస్తే, ATMలో OTPని నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. సోషల్ మీడియాలో మోసగాళ్ల నుండి తన కస్టమర్లను రక్షించడానికి SBI తన వినియోగదారులకు సైబర్ సెక్యూరిటీ చర్యలు చేపడుతోంది. SBI గత వారం తన ఇటీవలి ట్వీట్లో, “SBI ATMలలో లావాదేవీల కోసం మా OTP ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ మోసగాళ్లకు వ్యతిరేకంగా టీకా. మోసం నుండి మిమ్మల్ని రక్షించడం ఎల్లప్పుడూ మా ప్రధాన అంశం.” అంటూ ట్వీ్ట్ చేసింది.
Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/9EnJH883bx
— State Bank of India (@TheOfficialSBI) November 21, 2021
నకిలీ లేదా అనధికారిక లావాదేవీల సంఖ్యను తగ్గించడానికి OTP ఆధారిత ATM లావాదేవీని 2020లో ప్రవేశపెట్టారు. దాని OTP ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రారంభించడంతో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ATM సేవ ద్వారా నగదు ఉపసంహరణకు మరో భద్రత జోడించింది. బ్యాంక్లో రిజిస్టర్ అయిన కస్టమర్ మొబైల్ నంబర్కు OTP అందుతుంది. ఈ అదనపు ధృవీకరణ అంశం స్టేట్ బ్యాంక్ కార్డ్ హోల్డర్ను ఏ ఇతర వ్యక్తి మోసపూరిత ATM నగదు ఉపసంహరణ నుండి రక్షిస్తుంది. తన ఫోన్కు OTP వస్తుందనే కస్టమర్ మాత్రమే ATM నుండి డబ్బును తీసుకోగలరు. ఇది మోసాలను అరికడుతుంది.
స్టేట్ బ్యాంక్ కార్డ్ హోల్డర్ ఇతర బ్యాంకుల ATMల నుండి నగదు విత్డ్రా చేస్తే ఈ సదుపాయం వర్తించదు. SBI ప్రకారం, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (NFS)లో ఈ పని ఇంకా ప్రారంభించలేదు. NFS దేశంలో అతిపెద్ద ఇంటర్ఆపరబుల్ ATM నెట్వర్క్, దేశీయ ఇంటర్బ్యాంక్ ATM లావాదేవీలలో 95 శాతానికి పైగా నిర్వహిస్తుంది.కార్డ్ హోల్డర్ అతను విత్డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత, ATM స్క్రీన్ OTP విండోను చూపుతుంది. లావాదేవీని పూర్తి చేయడానికి, కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన OTPని నమోదు చేయాలి.