Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem trees: అంతుచిక్కని కారణం.. నిట్టనిలువునా ఎండిపోతున్న వేపచెట్లు

ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. 

Neem trees: అంతుచిక్కని కారణం.. నిట్టనిలువునా ఎండిపోతున్న వేపచెట్లు
Neem Trees
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 27, 2021 | 9:24 PM

ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి.  కర్ణాటక, రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిర్జీవంగా మారిన వేప చెట్లు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం.. డై బ్యాక్‌ డిసీజ్‌ అని కొందరు.. కాదు టీ మస్కిటో బగ్‌ వల్ల అని మరికొందరు నిపుణులు చెబుతున్న మాట. ఈ పరిణామంపై లోతుగా వర్సిటీల సమన్వయంతో అటవీ శాఖ విస్తృత పరిశోధనలు చేపట్టాలంటున్నారు నిపుణులు. అనంతపురం, కర్నూలు తదితర రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వేపచెట్లు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. మొవ్వులు, చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పొలాలు, బంజరు భూముల్లోనే కాకుండా.. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం వంటి నగర, పట్టణ ప్రాంతాల్లోనూ వేప చెట్లు చనిపోతున్నాయి. దీనికి పలు కారణాలు చెబుతున్నారు ఉస్మానియా యూనివర్శిటీ ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్లు.

వేప చెట్లకి డై బ్యాక్ డీసీజ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లే పురుగు పట్టడం, ఎండుతున్నట్లు కనిపించడం, రంగు మారినట్లు చెప్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంవిరాన్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెస్సార్ శశికళ. ‘టీ మస్కిటో బగ్‌’ అనే పురుగు ఆశించడం వల్ల సుడి భాగం క్రమంగా రెమ్మలు, కొమ్మలు, కాండం ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని తెలిపారు. వేప మన దేశ వృక్ష జాతి. సర్వరోగ నివారణిగా, పరమ పవిత్రంగా భావించే వేప చెట్లకు ఇలాంటి పరిస్థితి రావడం అరుదు… వేప చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉంది.

Also Read:  “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్

48 వేల మందికి ఉద్యోగాలు… ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్