AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: వ్యవసాయం చేస్తున్న రిటైర్మెంట్ NSG కమాండో.. నెలకు రూ. 25 లక్షల సంపాదన..

NSG కమాండోగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న అతను అందరికంటే భిన్నంగా వ్యవసాయం రంగాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు పంటలు పండించే విషయంలో ప్రావీణ్యం పొందుతున్నారు. వ్యవసాయం చేస్తూ ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఖర్జూరం, దానిమ్మ, జామ, నిమ్మ, దోస కాయ, పుచ్చకాయ వంటి అనేక రకాల పంటలతో అతని తోటలు కనువిందు చేస్తూ ఉంటాయి.

Success Story: వ్యవసాయం చేస్తున్న రిటైర్మెంట్ NSG కమాండో.. నెలకు రూ. 25 లక్షల సంపాదన..
Nsg Commando Mukesh Manju
Surya Kala
|

Updated on: Aug 27, 2023 | 10:32 AM

Share

NSG కమాండోల పేరు వింటేనే ఎటువంటి ఉగ్రవాదులకైనా  చెమటలు పట్టాల్సిందే..  రెప్పపాటులో చిరుతపులిలా ప్రత్యర్థులపై దాడి చేసేంత చురుకుదనం వీరి సొంతం. అయితే అలాంటి ఒక NSG కమాండో ఇపుడు వ్యవసాయం చేస్తూ అక్కడ కూడా తనదైన రికార్డ్ ను సృష్టిస్తున్నాడు. NSG కమాండోగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న అతను అందరికంటే భిన్నంగా వ్యవసాయం రంగాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు పంటలు పండించే విషయంలో ప్రావీణ్యం పొందుతున్నారు. వ్యవసాయం చేస్తూ ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. విశేషమేమిటంటే.. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆధునిక పద్ధతిలో గార్డెనింగ్ చేస్తున్నాడు. ఖర్జూరం, దానిమ్మ, జామ, నిమ్మ, దోస కాయ, పుచ్చకాయ వంటి అనేక రకాల పంటలతో అతని తోటలు కనువిందు చేస్తూ ఉంటాయి.

నిజానికి.. ఈ రైతు పేరు ముఖేష్ మంజు.. రాజస్థాన్‌లోని పిలాని నివాసి. గతంలో ముఖేష్ ఎన్‌ఎస్‌జీలో కమాండర్‌గా విధులు నిర్వహించారు. 2018లో పదవీ విరమణ పొందిన తర్వాత సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయంతో అతని అదృష్టం మారిపోయింది. అయితే పదవీ విరమణ చేయకముందే 2012లో తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేయడం ప్రారంభించానని ముఖేష్  చెబుతున్నారు. అయితే తాను సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. అతని తోటలో నిమ్మ, దానిమ్మ, ఖర్జూరంతో సహా అనేక రకాల పండ్ల చెట్లను నాటాడు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఖర్జూరం సాగుకు ప్రభుత్వం నుంచి రాయితీ కూడా పొందాడు.

అతని సంపాదన గతంలో కంటే 10 రెట్లు పెరిగింది

విశేషమేమిటంటే ముఖేష్ మంజు తన తోటలో ఆగ్రో టూరిజం కూడా ప్రారంభించాడు. ప్రజలు ఆయన పొలానికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో, ముఖేష్ వారికి పండ్లు కూడా తినడానికి ఇస్తూ ఉంటాడు. పర్యాటకులు ముఖేష్ పొలంలోని పండ్లు, కూరగాయలను నేరుగా కొనుగోలు చేస్తారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే 10 రెట్లు పెరిగిందని చెప్పారు. నేడు ఏటా 25 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

చెరువులో చేపలు పట్టడం

ముఖేష్ వద్ద ఇప్పటికీ సాహివాల్ , గిర్ వంటి దేశీయ జాతులకు చెందిన అనేక ఆవులు ఉన్నాయి. అతడికి ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. తన పొలంలోని కొంత భాగంలో పౌల్ట్రీని పెంచుతారు. వర్షపు నీటిని సేకరించేందుకు తన పొలాల్లో చెరువును నిర్మించుకున్నాడు. దీంతో పాటు ఈ చెరువులో చేపల పెంపకం కూడా చేస్తుండడంతో మంచి లాభాలు వస్తున్నాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..