PCOD: భారతీయ మహిళల్లో సీపీఓడీ సమస్య ఎందుకు పెరుగుతోంది? ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి?

భారతదేశంలోని మహిళల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ (PCOD), పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) సమస్య గణనీయంగా పెరుగుతోంది. ఈ వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. సకాలంలో చికిత్స చేయకపోతే వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి వృద్ధాప్యంలో కూడా రావచ్చు. గత దశాబ్ద కాలంలో దేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. 16 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు

PCOD: భారతీయ మహిళల్లో సీపీఓడీ సమస్య ఎందుకు పెరుగుతోంది? ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి?
Pcod
Follow us

|

Updated on: Apr 16, 2024 | 8:43 PM

భారతదేశంలోని మహిళల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ (PCOD), పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) సమస్య గణనీయంగా పెరుగుతోంది. ఈ వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. సకాలంలో చికిత్స చేయకపోతే వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి వృద్ధాప్యంలో కూడా రావచ్చు. గత దశాబ్ద కాలంలో దేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. 16 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు.  నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. భారతదేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు పీసీఓడీతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వంధ్యత్వానికి ప్రధాన కారణంగా మారుతోంది. 2021లో లాన్సెట్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పీసీఓడీచికిత్స చేయకపోతే 15 నుండి 20 శాతం మంది మహిళలు ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు లోనవుతారు. అందుకే ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో మీరు ఊహించవచ్చు. అయినప్పటికీ భారతదేశంలోని చాలా మంది మహిళలకు ఈ వ్యాధి గురించి తెలియదు. దీని కారణంగా చాలా సందర్భాలలో వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది. మహిళలు వంధ్యత్వానికి గురవుతారు.

ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి?

ఈ మూడు లక్షణాలలో కనీసం రెండు ఉన్న మహిళల్లో వైద్యులు సాధారణంగా పీసీవోడీని నిర్ధారిస్తారని డాక్టర్ సలోని వివరించారు.

  • అధిక ఆండ్రోజెన్ స్థాయిలు
  • ఋతుస్రావం తేదీలో మార్పు
  • అండాశయ తిత్తి

ఈ సమస్యలు కనిపిస్తే పరీక్ష చేస్తారు. అంతే కాకుండా అనేక రకాల రక్త పరీక్షలు కూడా చేస్తారు. వీటిలో కొలెస్ట్రాల్, ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్ పరీక్షలు ఉన్నాయి. అండాశయాలు, గర్భాశయాన్ని పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ కూడా చేయబడుతుంది.

పీసీఓడీకి చికిత్స ఏమిటి?

ఎయిమ్స్ న్యూఢిల్లీ ప్రొఫెసర్ డా.రీమా దాదా మాట్లాడుతూ.. ఈ వ్యాధికి మందులు, సర్జరీతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అదనంగా మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని డాక్టర్ మీకు సలహా ఇస్తున్నారు. జీవనశైలి గురించి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆహారంలో ఆకుపచ్చని పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలని చెప్పారు. ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచడం మంచిది. బరువును నిర్వహించడానికి వ్యాయామం సిఫార్సు చేయబడింది. దీంతో పాటు రోగా యోగా కూడా చేయాలని సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు
ఏకంగా 9శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే ఈ బ్యాంకులే..
ఏకంగా 9శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే ఈ బ్యాంకులే..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు