AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీలు ఖరాబ్ కావొద్దంటే ఇప్పటి నుండే ఇవి తినడం మానేయండి

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. అవి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే పని చేస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకుంటే కిడ్నీల పనితీరు తగ్గిపోవచ్చు. అలాంటి ఆహారాలను తీసుకోకపోవడం వల్ల మనం కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కిడ్నీలు ఖరాబ్ కావొద్దంటే ఇప్పటి నుండే ఇవి తినడం మానేయండి
Healthy Kidneys
Follow us
Prashanthi V

|

Updated on: May 08, 2025 | 5:00 PM

మన శరీరంలోని ముఖ్యమైన భాగాలు బాగా పని చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలు.. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి అవి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహారాలు కిడ్నీలు సరిగా పని చేయకుండా చేసే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని ఎక్కువగా తింటే నెమ్మదిగా సమస్యలు మొదలవుతాయి. అందుకే ముందుగానే జాగ్రత్త పడటం చాలా మంచిది.

సాసేజ్‌లు, బేకన్, సాలామీ వంటివి మాంసం అయినప్పటికీ వాటిని రసాయనాలు కలిపి ఎక్కువ కాలం నిల్వ చేస్తారు. వాటిలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ఎక్కువ భారం పడుతుంది. చాలా కాలం పాటు వీటిని తింటే కిడ్నీలు సరిగా పనిచేయకపోవచ్చు.

డబ్బాల్లో ఉండే ఆహారంలో ఎక్కువ ఉప్పు, రసాయనాలు కలుపుతారు. క్యాన్డ్ బీన్స్, సూప్‌లు తరచుగా తింటే రక్తంలో ఉప్పు ఎక్కువై కిడ్నీలు సరిగా పనిచేయవు. దీనివల్ల రాళ్ల సమస్యలు రావచ్చు.

కూల్ డ్రింక్స్, సోడాల్లో చక్కెర చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా తాగితే షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. షుగర్ ఉన్నవాళ్లకు కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువ.

పిజ్జా, బర్గర్, చికెన్ ఫ్రై లాంటి వాటిలో చెడు కొవ్వులు, ఎక్కువ ఉప్పు ఉంటాయి. ఇవి రక్తనాళాలపై చెడు ప్రభావం చూపి కిడ్నీలకు రక్తం సరిగా వెళ్లనివ్వవు. దీనివల్ల సమస్యలు వస్తాయి.

రోజువారీ ఆహారంలో ఎక్కువ ఉప్పు తింటే ఒంట్లో నీరు నిలుస్తుంది. ఇది కిడ్నీలపై ఎక్కువ భారం వేస్తుంది. స్నాక్స్, పకోడీలు, పాప్‌ కార్న్‌ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తక్కువగా తినడం మంచిది.

డైట్ డ్రింక్స్, కృత్రిమ తీపి ఉన్న పదార్థాలు కిడ్నీల పనితీరును పాడుచేస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు రావచ్చు. వీటికి బదులు బెల్లం, తేనె లాంటివి వాడటం మంచిది.

పాలు, పెరుగులో ప్రోటీన్ ఉన్నా.. అవి ఎక్కువగా తింటే ఫాస్ఫరస్ ఎక్కువై కిడ్నీలు సరిగా పని చేయవు. వాటి బదులు బాదం పాలు, ఓట్స్ పాలు తాగడం మంచిది.

పాలకూర, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తక్కువగా తినాలి.

మన కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పిన వాటిని తక్కువగా తీసుకోవడం లేదా మానేయడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)