AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గర్భాధారణ సమయంలో ఈ జ్యూస్‌లు ప్రమాదకరం.. మధుమేహంతో పాటు పిల్లలపై తీవ్ర ప్రభావం!

చక్కెర పానీయాలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని మనందరికీ తెలుసు. చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల దంత సమస్యలు, బరువు పెరుగుట, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. గర్భధారణ సమయంలో షుగర్ డ్రింక్స్ తాగే మహిళలకు పుట్టే పిల్లల్లో చాలా రకాల సమస్యలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. పీర్-రివ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం..

Health Tips: గర్భాధారణ సమయంలో ఈ జ్యూస్‌లు ప్రమాదకరం.. మధుమేహంతో పాటు పిల్లలపై తీవ్ర ప్రభావం!
Health Tips
Subhash Goud
|

Updated on: Aug 05, 2024 | 11:26 AM

Share

చక్కెర పానీయాలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని మనందరికీ తెలుసు. చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల దంత సమస్యలు, బరువు పెరుగుట, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. గర్భధారణ సమయంలో షుగర్ డ్రింక్స్ తాగే మహిళలకు పుట్టే పిల్లల్లో చాలా రకాల సమస్యలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. పీర్-రివ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో చక్కెర పానీయాలను తీసుకునే మహిళలు వారిపై, వారి పుట్టబోయే పిల్లలపై ప్రతికూల ప్రభావాలను చూపుతారు.

ఈ సర్వే ఏప్రిల్ – జూన్ 2022, 2023లో నిర్వహించారు. ఈ సర్వేలో 4 వేల మందికి పైగా గర్భిణులు ఉన్నారు. సర్వే సందర్భంగా ఈ గర్భిణీ స్త్రీలందరికీ పండ్ల రసం, కార్బోనేటేడ్ డ్రింక్స్, ఫిజీ డ్రింక్స్, సోడా, జ్యూస్, మిల్క్ డ్రింక్స్ ఇచ్చారు. ఈ సర్వే చివరిలో చక్కెర పానీయాలు అధికంగా తీసుకునే స్త్రీలు గర్భధారణ సమయంలో మధుమేహం సమస్యతో బాధపడుతున్నారని తేలింది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహ సమస్యను జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్భధారణ మధుమేహం విషయంలో పిల్లల బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ప్రసవ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది కాకుండా గర్భధారణ మధుమేహం కూడా శిశువు అకాల పుట్టుకకు, కామెర్లు సమస్యకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: చిగుళ్లలో నొప్పి ఉందా? దంతాలు పసుపు రంగులో మారుతున్నాయా? ఇలా చేస్తే మెరిసిపోవాల్సిందే!

ఇవి కూడా చదవండి

సర్వేలో వారానికి మూడుసార్లు చక్కెర పానీయాలు తీసుకునే మహిళల్లో గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం 38 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఈ మహిళల్లో గర్భధారణ రక్తపోటు ప్రమాదం 64 శాతం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. గర్భధారణ సమయంలో చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల పిండానికి తగినంత రక్తం లభించదని, దాని కారణంగా దాని పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వేలో కనుగొన్నారు. అలాగే, దీని కారణంగా అకాల డెలివరీ ప్రమాదం పెరుగుతుంది.

ఈ చక్కెర పానీయాలను వారానికి నాలుగు సార్లు తీసుకోవడం కూడా మాక్రోసోమియా ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ పరిస్థితిలో నవజాత శిశువు సగటు కంటే చాలా పెద్దది. ఈ సర్వే ముగింపులో గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల గర్భధారణ మధుమేహం, గర్భధారణ రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది కాకుండా, మాక్రోసోమియా సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మహిళలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యకరమైన వస్తువులను గరిష్ట పరిమాణంలో తీసుకోవడం చాలా అవసరమని పరిశోధకులు తెలిపారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఇంట్లో పనివాళ్లకు నెలకు జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us