AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health: కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? వామ్మో.. ఎముకలు అరిగిపోతాయ్ జాగ్రత్త.. షాకింగ్ విషయాలు మీకోసం..

ఆధునిక జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. దీంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కొన్ని పదార్థాలు.. శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి వాటిల్లో కూల్ డ్రింక్స్ ఒకటి.. శీతల పానీయం మన దాహాన్ని తీర్చే పానీయం. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. పిజ్జా, బర్గర్, ఏదైనా స్పైసీ ఫుడ్.. ఇలా ఏం తిన్నా.. కోక్ బాటిల్ ఉండాల్సిందే..

Bone Health: కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? వామ్మో.. ఎముకలు అరిగిపోతాయ్ జాగ్రత్త.. షాకింగ్ విషయాలు మీకోసం..
Health News
Shaik Madar Saheb
|

Updated on: Oct 23, 2023 | 6:42 PM

Share

ఆధునిక జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. దీంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కొన్ని పదార్థాలు.. శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి వాటిల్లో కూల్ డ్రింక్స్ ఒకటి.. శీతల పానీయం మన దాహాన్ని తీర్చే పానీయం. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. పిజ్జా, బర్గర్, ఏదైనా స్పైసీ ఫుడ్.. ఇలా ఏం తిన్నా.. కోక్ బాటిల్ ఉండాల్సిందే.. కానీ, ఈ శీతల పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జీవనశైలి మందగించడమే కాకుండా ఎముకలు బలహీనపడతాయని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు. ఇది 40 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో ఎముకల ఖనిజ సాంద్రత (BMD) తగ్గడానికి దారితీస్తుంది. ఇది ఆస్టియోపోరోసిస్‌గా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిరోజూ శీతల పానీయాలు తీసుకోవడం వల్ల పెద్దవారిలో ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉందని పలువురు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో 7 సంవత్సరాల పాటు 17,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ వాస్తవాన్ని కనుగొన్నట్లు వివరిస్తున్నారు. వాస్తవానికి ఎముకల ఆరోగ్యంపై సాఫ్ట్ డ్రింక్స్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శీతల పానీయాలలో ఉండే చక్కెర, సోడియం, కెఫిన్ వల్ల మన శరీరంలో క్యాల్షియం తగ్గి ఎముకలు విరిగిపోయే ప్రమాదం వస్తుందని ఆర్థోపెడిక్ నిపుణులు పేర్కొంటున్నారు. శీతల పానీయాల వల్ల కలిగే నష్టాల గురించి, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి వాటి వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. కూల్ డ్రింక్స్ వల్ల అందరికీ ప్రమాదమేనంటూ హెచ్చరిస్తున్నారు.

మహిళలకు మరింత ప్రమాదం..

ముఖ్యంగా మహిళలు శీతల పానీయాల పట్ల మరింత స్పృహతో ఉండాలి. శీతల పానీయాలు తీసుకోవడం వ్లల మహిళలకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి భారతదేశంలో రుతువిరతి వయస్సు 47 సంవత్సరాలు, పాశ్చాత్య దేశాలలో ఇది 50 సంవత్సరాలు. అందువల్ల, మెనోపాజ్ సమయంలో స్త్రీల ఎముకలు వేగంగా అరిగిపోతాయి. అందుకే దానితో పాటు శీతల పానీయాలు తీసుకుంటే స్త్రీల ఎముకలు బలహీనపడే అవకాశం మరింత పెరుగుతుంది. హార్మోన్ ఈస్ట్రోజెన్ దాని స్రావం ఆగిపోయినప్పుడు కొత్త ఎముకల ఏర్పాటులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. BMD తగ్గుతుంది.. బోలు ఎముకల వ్యాధి వస్తుంది. కాబట్టి వెన్నునొప్పితో బాధపడే 45 ఏళ్లు పైబడిన మహిళలు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి