శత్రువులుగా మారుతున్న మిత్రులు..!
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, మంచు మనోజ్లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జన్మించారు
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, మంచు మనోజ్లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జన్మించారు. మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ తరువాత మంచి స్నేహితులుగా మారి తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఒకరిపై మరొకరి ప్రేమను ఈ ఇద్దరు పలుమార్లు బయటపెట్టారు. ఇదంతా పక్కనపెడితే ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు శత్రువులుగా మారబోతున్నారట.
అయితే నిజంగా కాదులెండి. ఎన్టీఆర్ సినిమా కోసం మనోజ్ విలన్గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న ఎన్టీఆర్, ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. పనిలో పనిగా నటీనటులను ఎంచుకున్నారట త్రివిక్రమ్. ఈ క్రమంలో ఇందులో విలన్గా మనోజ్ను తీసుకోవాలని మాటల మాంత్రికుడు అనుకున్నారట. దీనికి సంబంధించి మనోజ్తో సంప్రదింపులు జరపడం, ఓకే అవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు మనోజ్ మరో అస్సెట్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం ఉండదు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోంది.