Vakeel Saab Movie: దుండిగల్ MLRIT కాలేజీలో ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్.. మధ్యాహ్నం 2 గంటలకు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది హిందీ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్. ఈ సినిమాలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది హిందీ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మగువా మగువా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోగలదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ మ్యూజిక్ ఫెస్ట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు దుండిగల్లోని MLRIT కాలేజీలో జరగనుంది. ప్రస్తుతం పవన్ రానాతో కలిసి ‘అయ్యప్పునుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. దాదాపు 170 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించబోతున్నారట. అంతే కాదు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతేడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిధులుగా అగ్ర హీరోలు వస్తున్నట్లుగా ఓ వార్త ఫీల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితోపాటు.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ ఈవెంట్లో మెగా హీరోలు ముగ్గురు ఒకే ఫ్రేంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే గనక జరిగితే ఫ్యాన్స్కు పండగే.
Also Read: