AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వచ్చి మరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమాను చూసేందుకు ఏపీ నుంచి పలువురు తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్‌కు వచ్చి సినిమాను చూశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి […]

హైదరాబాద్ వచ్చి మరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 6:12 PM

Share

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమాను చూసేందుకు ఏపీ నుంచి పలువురు తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్‌కు వచ్చి సినిమాను చూశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి ఉండవల్లి సినిమా చూశారు. ఈ విషయాన్ని సిరా శ్రీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘రాజమండ్రిలో రిలీజ్ అవ్వలేదని హైదరాబాద్ కి వచ్చి మరీ సినిమా చూసిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్. చిత్రంలో ఎమెస్కో అధినేత శ్రీ విజయకుమార్’’ అంటూ సిరా శ్రీ కామెంట్ పెట్టారు.