AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balarkishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం

Nandamuri Balarkishna: ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు,  ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడే కాదు..తమ అభిమానులు ఇబ్బందులు ఉన్నారంటే.. కొంతమంది హీరోలు స్పందిస్తారు. తమ తోచిన విధంగా సహాయం చేస్తారు..

Nandamuri Balarkishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం
Balakrishna
Surya Kala
|

Updated on: Sep 21, 2021 | 10:13 AM

Share

Nandamuri Balarkishna: ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు,  ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడే కాదు..తమ అభిమానులు ఇబ్బందులు ఉన్నారంటే.. కొంతమంది హీరోలు స్పందిస్తారు. తమ తోచిన విధంగా సహాయం చేస్తారు.  చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, లారెన్స్ , విశాల్ , జూ. ఎన్టీఆర్ వంటి అనేక మంది హీరోలు తమ అభిమానులకే కాదు.. ఎవరు కష్టాలు ఉన్నారని తెలిసినా..  తమ వంతు సహాయంగా ఏదోకటి చేస్తూ అండగా నిలబడతారు. తాజా మరోసారి నందమూరి బాలకృష్ణ తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఓ చిన్నారి ప్రాణాలు కాపాడడానికి వేగంగా స్పందించారు.  వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ స్థాపించిన ” బసవతారకం”  క్యాన్సర్ హాస్పిటల్.. ఎంతోమంది క్యాన్సర్ పేషేంట్స్  ప్రాణాలను కాపాడుతుంది. తండ్రి ఎన్టీఆర్ తర్వాత ఈ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిద్వారా పేద ధనిక అనేక తేడాలేకుండా అనేకమంది క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు బాలకృష్ణ. ఈనేపధ్యంలో  కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చికిత్స నిమిత్తం  మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే ఒక చిన్న పాప క్యాన్సర్ వ్యాధితో హాస్పిటల్ లోకి చేరింది.  మణిశ్రీ ఆపరేషన్ కోసం 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఆ  చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో లక్షా 80 వేల వరకూ డబ్బులు సేకరించారు.  అయితే మణిశ్రీ ఆపరేషన్ కోసం ఇంకా  5 లక్షల 20 వేల రూపాయలు తక్కువ అయ్యాయి. దీంతో మణిశ్రీ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిశారు. తమ ఆర్ధిక పరిస్థితిని వివరించారు. తమ కూతురు ఆరోగ్య పరిస్థితిని వివరించి .. ఎలాగైనా తమ పాప ఆపరేషన్ విషయంలో సహాయం చేయమని అర్ధించారు.

దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్   ప్రెసిడెంట్  మణిశ్రీ వ్యాధి గురించి.. ఆపరేషన్ గురించి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్ళాడు. వెంటనే బాలకృష్ణ స్పందించి పాపా ఆపరేషన్ కు కట్టాల్సిన  5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు చిన్నారికి తగిన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి చెప్పారు. ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఓ వైపు ఎమ్మెల్యేగా తన భాద్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు వరస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా తాజాగా అఖండ మూవీలో నటిస్తున్నారు.   నెక్స్ట్  డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో  ఒక సినిమాలో నటించనున్నారు.

Also Read: Kidnapping the Bride: ఆ దీవిలో జరిగేవన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన యువతిని కిడ్నప్ చేసిమరీ పెళ్లి చేసుకునే యువకులు..