AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drug Case: ముమైత్ ఖాన్ వంతు వచ్చింది.. నేడు ఈడీ అధికారుల ముందుకు ..

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్యవహారం పై పోలీసులు, ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు.

Tollywood Drug Case: ముమైత్ ఖాన్ వంతు వచ్చింది.. నేడు ఈడీ అధికారుల ముందుకు ..
Mumaith Khan
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2021 | 7:24 AM

Share

Tollywood drug case: బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్యవహారం పై పోలీసులు, ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇక అక్కడ తీగ లాగితే ఇప్పుడు టాలీవుడ్ డొంకలు కూడా కదులుతున్నాయి. ఇప్పటికే పలువురు సినిమాతారలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశంపైనే విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు పూరిజగన్నాథ్, ఛార్మి, రకుల్ , రానా, నవదీప్, నందు, రవితేజల విచారణ పూర్తయింది. డ్రగ్స్ సప్లేయిర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇక నేడు నటి ముమైత్ ఖాన్ వంతు వచ్చింది.

నేడు ఈడీ అధికారాల ముందుకు ముమైత్ ఖాన్ హాజరుకానుంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలతోపాటు.. ఆమె బ్యాంకు ఖాతాల‌ను అధికారులు పరిశీలించనున్నారు. అలాగే మిగిలిన డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆమె ఉన్న సంబంధాలు, వారితో జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై ఆరా తీయనున్నారు. ఇక 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Regina Cassandra: లేడీ ఓరియెంటెడ్ మూవీతో రానున్న రెజీనా.. ఆకట్టుకుంటున్న ‘నేనేనా’ ట్రైలర్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో గుంటనక్క ఎవరో సన్నీకి క్లారిటీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!

ahesh Babu: సమాజంలో పడిపోతున్న విలువలకు ఇది తార్కాణం.. సైదాబాద్‌ చిన్నారి ఘటనపై స్పందించిన మహేష్‌ బాబు..