AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: గొప్ప మనసు చాటుకున్న అందాల భామ.. పేదల కోసం ఏం చేసిందంటే

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది తాప్సీ పన్నూ. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలో చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో పడింది. రెండు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

Taapsee Pannu: గొప్ప మనసు చాటుకున్న అందాల భామ.. పేదల కోసం ఏం చేసిందంటే
Taapsee Pannu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 14, 2025 | 12:11 PM

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో తాప్సీ పన్ను ఒకరు. టాలీవుడ్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కట్టిపడేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. తరువాత 2011లో, వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఆడుకలం చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.. ఆ తర్వాత తాప్సీ తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఈ బ్యూటీ 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

వస్తాడు నా రాజు, మిస్టర్ పర్‌ఫెక్ట్, సాహ‌సం,ఆనందో బ్రహ్మ, మొగుడు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్‌లో కాంచన 2, వై రాజా వై, గేమ్ ఓవర్ సహా తమిళ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తాప్సీ బాలీవుడ్‌కి వెళ్లి మిషన్ మంగళ్, చాంత్ కి ఆంక్, తప్పట్, హసీన్ దిల్రూబా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ అయిన సబాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

రెగ్యులర్ హీరోయిన్ అయిన తాప్సీ బేబీ, పింక్, ది ఘాజీ ఎటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక నటిగా నిరూపించుకుంది. హిందీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా తాప్సీ గొప్ప మనసు చాటుకుంది. ఎండలు పెరిగిపోవడంతో జనాలు ముఖ్యంగా పేద ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారికి తాప్సీ సాయం అందించింది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేసింది. భర్త మథియోస్ బోతో కలిసి పేదలకు ఫ్యాన్స్, కూలర్లు అందించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తాప్సీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసున్న మనిషి అంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..