రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ బ్యూటీ.. చేసిన సినిమాలు తక్కువే కానీ ఎక్కువగా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో మెప్పిస్తుంది. రకరకాల ఫొటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది .

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ సెన్సేషన్.. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత చిన్న చిన్న పాత్రలు చేసింది. సినిమాలతో కంటే ఆమె చేసిన కామెంట్స్ తోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా చాలా కామెంట్స్ చేసింది. అలాగే సినిమా అవకాశాల పేరుతో జరిగే మోసాల గురించి.. కొందరు అమ్మాయిలను ఎలా లొంగదీసుకుంటారో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది ఆమె.. వీటితో పాటు కన్న తండ్రి పై కూడా సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తన తండ్రి తనకు వేదించే వాడు అని చెప్పు షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఆసక్తికర కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. ప్రతిరోజు నాకు 12 హగ్గులు కావాలి అని అంటుంది ఆ టాలీవుడ్ నటి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
నటి గాయత్రీ గుప్తా ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ. పలు వివాదాలతో ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు.. ఆతర్వాత చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. అలాగే మరికొన్ని సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ప్రతిరోజు నాకు 12 హగ్గులు కావాలని, లేకపోతే నిద్ర పట్టదని తెలిపింది. 12 హగ్గులు కావాలి. అది కూడా అమ్మ, నాన్న, అక్క లేదా ఇలా ఎవరి నుంచైనా సరే.. ఒక 20 సెకన్లు నా శరీరానికి ఆ టచ్ కావాలి.. చేడు ఉద్దేశం లేని ఆ స్పర్శతో మనం సేఫ్ గా ఉన్నాం అనే అనుభూతి కలుగుతుంది. గతంలో నాకు ఫిజికల్ టచ్ లు చాలా దొరికేవి.. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఫిజికల్ టచ్ కాదు కదా కనీసం మాట్లాడటానికి కూడా మనుషులకు సమయం దొరకడం లేదు అని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్త. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




