రష్మికతో కలిసి డిన్నర్‏కు వెళ్లిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

Vijay Devarakonda & Rashmika Mandanna: 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాలతో హిట్ పెయిర్‏గా పేరు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ,

రష్మికతో కలిసి డిన్నర్‏కు వెళ్లిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..
Vijay Devarakonda Rashmika
Follow us

|

Updated on: Mar 25, 2021 | 9:27 PM

Vijay Devarakonda & Rashmika Mandanna: ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో హిట్ పెయిర్‏గా పేరు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ సినిమాల తర్వాత ఇద్దరు వేర్వేరు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరపగుతుంది. ఇక రష్మిక కూడా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. అయితే గత కొంత కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ… కలసి ముంబైలోని ఓ స్టార్ హోటల్‏లో డిన్నర్‏కు వెళ్లారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. షూటింగ్‏లో ఎంత బిజీగా ఉన్నా.. వీరిద్దరు ఎక్కువగా కలుసుకునేందుకు టైం కేటాయిస్తున్నారంటూ బీటౌన్‏లో టాక్ నడుస్తోంది. కాగా సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న `మిష‌న్ మ‌జ్ను` సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కోసం ముంబై వెళ్లిన రష్మిక అక్కడే ఉన్న విజయ్ దేవరకొండతో కలిసి డేట్‏కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటలలో రష్మిక చేతిలో అందమైన వైట్ ఫ్లవర్స్ పట్టుకోని కనిపించింది. ఇక మరోసారి వీరిద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు తమకు తోచినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

శుక్రవారమే ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్.. అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. మరీ ఈసారైన నితిన్ హిట్ కొడతాడా ?

కీర్తి వల్ల మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం.. బాధలు చెప్పుకుంటున్న దేవి శ్రీ.. ఇంతకీ ఏం చేసిందంటే..