AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: మదురై దంపతులకు నోటీసులు పంపిన హీరో.. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానంటూ..

ఇటీవల మధురై వేల్పూరికీ చెందిన కేతిరేశన్, మీనాక్షి దంపతులు.. ధనుష్ తమ కుమారుడని.. సినిమాల్లో నటించేందుకు ఇంట్లో నుంచి పారిపోయాడని..

Dhanush: మదురై దంపతులకు నోటీసులు పంపిన హీరో.. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానంటూ..
Dhanush
Rajitha Chanti
|

Updated on: May 22, 2022 | 1:12 PM

Share

తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తమ రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు అంటూ మధురైకి చెందిన కేతిరేశన్, మీనాక్షీ దంపతులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తమకు జీవనాధరం కోసం నెలకు రూ. 60 వేలు ఇవ్వాలని ఆ దంపతులు ధనుష్‏కు నోటీసులు పంపారు.. అయితే వారి మాటలు అబద్దాలు అని.. ధనుష్ పై కేవలం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ఆయన తండ్రి కస్తూరి రాజా..తన పై గురించి అసత్యపు ప్రచారం చేస్తున్న మధురై దంపతులకు ధనుష్.. ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు పంపారు.. అబద్దాలు చెప్పడం మానుకోకపోతే.. వారిపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసులలో పేర్కోన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసిందనకు తమకు క్షమాపణ చెప్పాలన్నారు..

ఇటీవల మధురై వేల్పూరికీ చెందిన కేతిరేశన్, మీనాక్షి దంపతులు.. ధనుష్ తమ కుమారుడని.. సినిమాల్లో నటించేందుకు ఇంట్లో నుంచి పారిపోయాడని.. గతంలోనే కోర్టుకు తన జననదృవీకరణ పత్రాలను నకిలీ అందజేశారని ఆరోపించారు కేతిరేశన్ దంపతులు.. ప్రస్తుతం తమకు జీవనాధారం కోసం నెలకు రూ. 60 వేలు ఇప్పించాలని కోర్టును కోరారు.. దీంతో మద్రాసు హైకోర్టు హీరో ధనుష్ కు సమన్లు జారీ చేసింది. దీంతో మధురై దంపతులకు లీగల్ నోటీసులు పంపి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు ధనుష్. ఇటీవలే ఈ హీరో తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేశారు ధనుష్, ఐశ్వర్య. చివరిసారిగా ధనుష్ మారన్ సినిమాలో కనిపించారు..ప్రస్తుతం ఈ హీరో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ది గ్రే మ్యాన్, నానే వరువెన్, తిరుచితంబలం సినిమాల్లో నటిస్తున్నాడు.