AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu: వైరల్ అవుతున్న సమంత పోస్ట్.. రచ్చ రచ్చ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్

ఇప్పటికే సామ్ చాలా రకల పోస్ట్ లు షేర్ చేస్తుంది.. అలాగే తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్  2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్‌సీబీ, ఆర్ఆర్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో సామ్ చేసి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Samantha Ruth Prabhu: వైరల్ అవుతున్న సమంత పోస్ట్.. రచ్చ రచ్చ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్
Samantha
Rajeev Rayala
|

Updated on: May 22, 2024 | 12:18 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.. త్వరలోనే సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు సామ్. ఇక ఇప్పుడు సామ్ సోషల్ మీడియాలో వరుసగ పోస్ట్ లు పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సామ్ చాలా రకల పోస్ట్ లు షేర్ చేస్తుంది.. అలాగే తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్  2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్‌సీబీ, ఆర్ఆర్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో సామ్ చేసి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు సామ్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేసింది.? ఇంతకు ఆమె ఏం పోస్ట్ చేసింది.?

ఆర్‌సీబీ ఈసారి కప్పు కొట్టాలని చాలా మంది ప్రార్థిస్తున్నారు. ఈ ఏడాది అయినా ఆర్‌సీబీ ఐపీఎల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు (మే 22) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ రాజస్థాన్‌తో తలపడనుంది. ఆర్సీబీ గెలవాలని చాలా మంది ప్రార్థిస్తున్నారు. విరాట్ కోహ్లి సారథ్యంలోని ఆర్‌సిబి జట్టు గెలవాలని సమంత ప్రార్థించినట్లు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం సామ్ చేసిన ఈ పోస్ట్.  ‘నువ్వు గెలవాలని కోరుకుంటున్నా’ అంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘నీ హృదయం ఏది కోరుకున్నా, మీ ఆకాంక్షలు ఏమైనా, నేను మీ కోసం నిలబడతాను. మీరు గెలవడానికి అర్హులు’ అని సమంత పోస్ట్ చేసింది. దీంతో ఆర్‌సీబీ టీమ్‌కి సమంత సపోర్ట్ చేసిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సమంత ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలలో విరాట్ కోహ్లీని ప్రశంసించింది. ఆమె కోహ్లీ పై ప్రశంసలు కురించడంతో ఇప్పుడు సామ్ చేసిన పోస్ట్ ఆర్ సీబీ విన్ కోసమే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన సీడీసీ ఆరెంజ్ క్యాప్‌ను విరాట్ కోహ్లీ సాధించాడు. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.