AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క మెసేజ్ లైఫ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్

ప్రస్తుతం నేషనల్ క్ర‏ష్‏గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది ఈ అందాల హీరోయిన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది.

ఒకే ఒక్క మెసేజ్ లైఫ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2026 | 11:22 AM

Share

అందాల భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అమ్మడు. రీసెంట్ గా టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది యష్ హీరోగా నటించిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక రుక్మిణి వసంత్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ నేషనల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుక్మిణి తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సప్త సాగరాలు దాటి సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకుంది రుక్మిణి.

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

రిషబ్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరదాచే ఎల్లో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రుక్మిణి. హేమంత్ రావు దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చిందో తెలిపింది రుక్మిణి.ఈ సినిమా రుక్మిణికి రెండో సినిమా.. ఈ సినిమా కోసం హీరోయిన్ సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి ఇన్‌స్టాలో నేరుగా దర్శకుడికి ఒక మేసేజ్ చేశానని తెలిపింది.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

ఈ సినిమాలో నటించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని పదే పదే తేలిందట.. సోషల్ మీడియాలోనే కాకుండా, ఈమెయిల్స్‌ ద్వారా పంపినట్లు వివరించింది. దాదాపు 10రోజుల తర్వాత దర్శకుడు హేమంత్ రావు తనకు ఇన్ స్టాలో మెసేజ్ చేశారని తెలిపింది. అలా తనకు సప్త సాగరదాచే ఎల్లో మూవీలో ప్రియా అలియాస్ పుట్టి అనే పాత్ర వచ్చిందని తెలిపింది రుక్మిణి. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాక్సిక్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో హిట్ పడింది.

ఇవి కూడా చదవండి

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us