AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: ఆ కారణంతోనే నాకు కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి.. అసలు విషయం బయట పెట్టిన రకుల్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు టాలీవుడ్ ను ఏలింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రకుల్. అలాగే దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..

Rakul Preet Singh: ఆ కారణంతోనే నాకు కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి.. అసలు విషయం బయట పెట్టిన రకుల్
Rakul
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2024 | 12:50 PM

Share

సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమస్యల్లో నేపోటిజం ఒకటి. చాలా మంది ఇండస్ట్రీలో నేపోటిజం గురించి మాట్లాడారు. సినీ వారసుల వల్ల చాలా మంది అవకాశాలు కోల్పోయారు కూడా. ముఖ్యంగా బాల్‌వుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణానంతరం నేపోటిజం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నటనలో ప్రతిభను కనబరుస్తున్న వారిని కాకుండా వారసత్వం ద్వారా సినిమా అవకాశాలు అందుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. గతంలో చాలా మంది సినీ నటులు బంధుప్రీతికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు నేపోటిజం కారణంగా తాను ఎదుర్కొన్న సమస్య గురించి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు టాలీవుడ్ ను ఏలింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రకుల్. అలాగే దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేను కూడా నేపాటిజం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి. నన్ను సంప్రదించి కూడా ఆతర్వాత మరొకరిని తీసుకున్నారు.  కానీ నేను దేనిని ద్వేషించే వ్యక్తిని కాదు. మా నాన్న ఆర్మీలో ఉన్నారు, నేను ఒకవేళ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుని ఉంటే.. నాకు సహాయం చేసి సలహాలు ఇచ్చేవారు, అలాగే ఇండస్ట్రీలోనూ జరుగుతుంది అది తప్పు అని చెప్పలేం’ అని రకుల్ ప్రీత్ సింగ్ నెపోటిజానికి అనుకూలంగా మాట్లాడింది.

ఇది కూడా చదవండి :NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్

రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ఎంతో ఎత్తుకు ఎదిగింది. 2014 నుండి, ఆమె దాదాపు ఐదు, ఆరు సంవత్సరాల పాటు తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా రాణించింది. అదే సమయంలో తమిళంలో కూడా చాలా మంది స్టార్ యాక్టర్స్‌ తో నటించింది. అలాగే రకుల్ పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత, నటుడు జాకీ భగ్నాని ఈ ఏడాది జనవరి నెలలో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తూనే ఉంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.