Pushpa 2: సంధ్య థియేటర్ ఘటనలో ఇంకా హాస్పటల్లోనే బాలుడు.. యోగక్షేమాలు తెలుసుకున్న నిర్మాత బన్నీవాస్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు హాస్పటల్ లో చికిత్సపొందుతున్నాడు

ఈనెల 5వ తేదీన అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ వివిధ రకాల నాలుగో తేదీ సాయంత్రం నుండి పలుచోట్ల ఈ చిత్ర ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్ షో జరిగింది. అయితే ప్రతి సినిమాకి వెళ్లినట్లే ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లకు వెళ్లడం జరిగింది. అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఉన్న సమయంలో ఫ్యాన్స్ మధ్య తొక్కేసేలాట జరిగింది. ఆ సంఘటనలో ఒక మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయాల పాలయ్యాడు.
ఆ సంగతి తెలిసిన అల్లు అర్జున్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన ఆ మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి తన వంతుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం పండగ చేస్తానని, అలాగే ఆ కుటుంబానికి ఏ విషయంలో అయినా అండగా ఉంటాను అని తెలిపారు. ఆ బాలుడికి కావలసిన వైద్య సదుపాయాల నిమిత్తం ఖర్చు అంతా తానే చూసుకుంటానని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది.
కాగా నేడు గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ప్రధాన వ్యక్తి బన్నీవాస్ ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లి, అతడిని చూసి, తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో సంప్రదించి తెలుసుకోవడం జరిగింది. చనిపోయిన మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాక వారికి ఎటువంటి విషయంలో అయినా తాము అండగా ఉంటామని, హాస్పిటల్ కు సంబంధించిన ఖర్చుమంతా తాము మరుస్తామని ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ వారికి చెప్పడం జరిగింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




