Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: పండ్ల తోటలో బుట్టబొమ్మ సందడి.. సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఆసక్తిర పోస్ట్..

ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న జనగణమన మూవీలో, త్రివిక్రమ్, మహేష్ కలయికలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28లోనూ నటిస్తోంది.

Pooja Hegde: పండ్ల తోటలో బుట్టబొమ్మ సందడి.. సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఆసక్తిర పోస్ట్..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 17, 2022 | 11:00 AM

ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో ఫుల్ ఫాంలో హీరోయిన్లలో పూజా హెగ్డే (Pooja Hegde) ఒకరు. గత కొద్ది కాలంగా వరుస ప్లాపులు వెంటాడుతున్న ఈ బుట్టబొమ్మ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. బీస్ట్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ అంతగా హిట్ కాలేకపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న జనగణమన మూవీలో, త్రివిక్రమ్, మహేష్ కలయికలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28లోనూ నటిస్తోంది. ఓవైపు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు వ్యక్తిగత ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది. తాజాగా తోటలో పండ్లు కోస్తున్న ఫోటోస్ షేర్ చేసింది బుట్టబొమ్మ.

పూజాకి సొంతంగా ఓ ఫామ్ ఉంది. అందులో చెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్పెబెర్రీలు, రెడు కురెంట్స్, బ్లాక్ కురెంట్స్ పండిస్తోంది. తాజాగా తన ఫామ్ లో సందడి చేసింది పూజా. తోటలోని పండ్లను కోస్తూ.. నీకోసమే అంటూ ఇన్ స్టాలో ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూజా చేసిన పోస్టుకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.