పాన్ ఇండియన్ మూవీలో పవన్..ఔరంగజేబు రోల్ హైలెట్..
2020 పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు గుర్తుండిపోయే సంవత్సరంలా కనిపిస్తోంది. ఇంక సినిమాలకు దూరపోతాడు అనుకున్న టైంలో రెండు ప్రాజెక్టులు పవర్స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా వారికి పండుగే. ఇప్పటికే `పింక్`రీమేక్ సంబంధించి అన్నీ పనులు సెట్ రైట్ అయ్యాయి. ఈ నెలలోనే మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. పవన్ ఈ మూవీ కోసం 20 రోజులే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు క్రిష్తో మూవీ దాదాపు ఖరారయ్యింది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ […]
2020 పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు గుర్తుండిపోయే సంవత్సరంలా కనిపిస్తోంది. ఇంక సినిమాలకు దూరపోతాడు అనుకున్న టైంలో రెండు ప్రాజెక్టులు పవర్స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా వారికి పండుగే. ఇప్పటికే `పింక్`రీమేక్ సంబంధించి అన్నీ పనులు సెట్ రైట్ అయ్యాయి. ఈ నెలలోనే మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. పవన్ ఈ మూవీ కోసం 20 రోజులే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు క్రిష్తో మూవీ దాదాపు ఖరారయ్యింది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీని నిర్మించనున్నారు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ సర్కులేట్ అవుతోంది.
మొగలాయిల కాలానికి సంబంధించిన ఓ హిస్టారికల్ కథను సిద్దం చేశాడట సెన్సుబుల్ డైరెక్టర్ క్రిష్. ఇందులో ఔరంగజేబు పాత్రను చాలా పవర్పుల్గా డిజైన్ చేశాడట. అతని రూలింగ్ సమయానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ చాలా కొత్తగా ఉటాయని సమాచారం అందుతోంది. ఔరంగజేబు పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడ్ని తీసుకురావాలని క్రిష్ ఆలోచిస్తున్నాడట. పవన్ కూడా క్రిష్ ప్రపోజల్కి అంగీకారం తెలిపాడట. ఇద్దరి హీరోయిన్ల అవసరం ఉన్న ఈ మూవీ కోసం ఇప్పటికే పూజా హెగ్డేను ఓకే చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్లో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సన్నాహాలు చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళుతుందని సమాచారం అందుతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.