Anita: ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఏమిటి ఇలా మారిపోయింది..? లేటెస్ట్ ఫోటో చూశారా
అనిత అసలు పేరు నటాషా హస్సానందని. హస్సానందని 14 అక్టోబర్ 2013న గోవాలో రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 9 ఫిబ్రవరి 2021న మొదటి సంతానంగా ఒక అబ్బాయి జన్మించాడు. తమ కుమారుడికి ఆరవ్ రెడ్డి అని పేరు పెట్టారు ఈ జంట.
కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రజల్లో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఆ హీరోయిన్ పేరు చెబితే ఫలానా పాత్ర మదిలో వెంటనే మెలుగుతుంది. అలానే హీరోయిన్ అనిత మీకు గుర్తు ఉండే ఉంటుంది. దివంగత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా చేసి నువ్వు నేను మూవీతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో.. ప్రేక్షకుల్లో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలో అన్ని పాటల అద్భుతం అంతే. ఇప్పటికి కూడా చాలామంది ప్లే లిస్ట్లో ఈ మూవీ సాంగ్స్ ఉంటాయి. తేజ డైరెక్షన్లో నువ్వు నేను తెరకెక్కిన విషయం తెలిసిందే.
హీరో ఉదయ్ కిరణ్-అనితల పెయిర్ మూవీలో చాలా క్యూట్గా ఉంటుంది. నువ్వు నేను తర్వాత కూడా అనితకి మంచి అవకాశాలు వచ్చాయి. శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో కనబడి ఆకట్టుకుంది. 2013 లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజ్ 43 సంవత్సరాలు. ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్తో అలానే ఉంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.