Nithya Menon : ప్రభాస్ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే వుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నిత్యామీనన్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో ఈ అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు అందాల నిత్యామీనన్.
Nithya Menon : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో ఈ అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు అందాల నిత్యామీనన్. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.. అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు , తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది నిత్యామీనన్. ఇటీవలే ఈ అమ్మడు నటించిన స్కై ల్యాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో నటించడమే కాదు..ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయలు పంచుకుంది. ఈ సందర్భంగా నిత్యా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. అయితే ఆమెను ఇప్పటికీ ప్రభాస్ ఇష్యునే వెంటాడుతుంది అని అంటుంది నిత్యా.. కెరీర్ బిగినింగ్ లో తనకు తెలుగు రాణి సమయంలో.. తెలుగు హీరోలు కూడా తెలియదట.. ఆ సమయంలో ప్రభాస్ ఎవరో తనకు తెలీయదు అని అంది. నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే.. ఆ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే వుంది. ఓ జర్నలిస్ట్ ఈ వ్యవహారాన్ని పెద్దది చేసి రాసారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా వార్తని సృష్టించారు. అప్పుడే నాకు అర్థమైంది ఎప్పుడు ఎక్కడ ఎలా వుండాలో తెలుసుకున్నాను. అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
మరిన్ని ఇక్కడ చదవండి :