AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha-Nayanthara: ఒకే స్క్రీన్‌పై మెరవనున్న సౌత్ ఇండియా క్వీన్స్.. అభిమానులకు ఐ ఫీస్ట్ !

నయన్, త్రిష.. ఇద్దరూ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్. టాప్ హీరోలు అందరితో పాడారు. అయితే వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అందుకు ముహూర్తం ఫిక్సైందా..?

Trisha-Nayanthara: ఒకే స్క్రీన్‌పై మెరవనున్న సౌత్ ఇండియా క్వీన్స్.. అభిమానులకు ఐ ఫీస్ట్ !
Nayanthara, Trisha
Ram Naramaneni
|

Updated on: Oct 13, 2022 | 1:05 PM

Share

పొన్నియిన్‌ సెల్వన్‌లో కుందవై కేరక్టర్‌ చేసిన త్రిష చరిష్మా ఇప్పుడు మామూలుగా లేదు. ప్రమోషన్లలో జోరు చూపిస్తూ గ్రేస్‌ఫుల్‌గా తనను తాను ప్రెజెంట్‌ చేసుకుంటున్నారు. తనతో పాటు నటించిన ఐశ్వర్యరాయ్‌ గురించి కూడా మాట్లాడుతూ ఫ్రెండ్లీ కోస్టార్‌ అనే క్రెడిట్స్ కొట్టేస్తున్నారు. ఇటు నయనతార కూడా ఇప్పుడు క్లౌడ్‌ నైన్‌లో ఉన్నారు. లూసిఫర్‌లో చిరంజీవి సిస్టర్‌ సత్యప్రియగా ఆమె చేసిన కేరక్టర్‌కి మరో రేంజ్‌ రెస్పాన్స్ వస్తోంది. పెళ్లయ్యాక నయనతార పర్ఫెక్ట్ హిట్‌ అందుకున్నారనే క్రెడిట్‌ కూడా దక్కింది.

త్వరలోనే నయనతార అండ్‌ త్రిష కలిసి ఓ సినిమాలో నటిస్తారనే మాట వినిపిస్తోంది. మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న ‘రామ్‌’ సినిమాలో త్రిష ఆల్రెడీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించాలన్నది జీతు జోసెఫ్‌ సంకల్పం. ఇందులోనే కీలక పాత్రలో నయన్‌తార కూడా నటిస్తారనే మాట జోరుగా వినిపిస్తోంది. కాత్తువాక్కులే రెండు కాదల్‌ సినిమాలో సమంత ప్లేస్‌లో ముందు త్రిషనే అనుకున్నారు మేకర్స్. కానీ త్రిష కాల్షీట్లు కుదరకపోవడంతో ఆ అవకాశం సమంతకు దక్కింది.

మొత్తానికి సౌత్‌లో నెక్ట్స్ లెవల్ క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్స్ ఇద్దరూ కలిసి నటించనున్నాన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే మాత్రం అభిమానులకు ఐ ఫీస్టే. మరి ఈ ముద్దుగుమ్మలు ఫ్యాన్స్‌కు ఆ చాన్స్ ఇస్తారో, లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..