ఆ జిల్లాలో ప్రఖ్యాత ఫోర్డ్ కంపెనీ జంక్షన్కు సుశాంత్ పేరు…
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఇప్పటికీ సుశాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఇప్పటికీ సుశాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కాగా నటుడి స్వస్థలం పూర్ణియా జిల్లా వాసులు..అతడికి ఘన నివాళి అర్పించారు. సిటీలోని చారిత్రాత్మక ఫోర్డ్ కంపెనీ జంక్షన్కు సుశాంత్ పేరు పెట్టారు. దీనితోపాటే మధుబని నుంచి మాతా ఏరియాని అనుసంధానం చేసే దారిని ఇకపై సుశాంత్ సింగ్ రాజ్పుత్ మార్గం అని పిలవనున్నారు. ఈ మేరకు జిల్లా మేయర్ సవితా దేవి వివరాలు తెలియజేశారు.
మున్సిపల్ కార్పోరేషన్లో… వాయిస్ ఓటింగ్ పద్దతి ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. అంతే కాకుండా, సుశాంత్ పూర్వీకుల గ్రామం పూర్ణియా అని.. హీరో చనిపోయిన అనంతరం తర్వాత అతడి కోసం ఓ స్థూపాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేసినట్లు సవితా దేవి వెల్లడించారు. సుశాంత్ బాల్య మిత్రుడు, బిహార్ వికాస్ మోర్చా అధ్యక్షుడు రాకేశ్ సింగ్ మట్లాడుతూ.. “ఇది సుశాంత్కు ట్రిబ్యూట్ మాత్రమే కాదని, రాష్ట్రానికే గర్వకారణం” అని పేర్కొన్నారు.