AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panja Vaishnav Tej : అక్కినేని వారి బ్యానర్ లో మెగాహీరో మూడవ సినిమా.. దర్శకుడు ఎవరో తెలుసా..?

ఉప్పెన' సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన 'ఉప్పెన' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Panja Vaishnav Tej : అక్కినేని వారి బ్యానర్ లో మెగాహీరో మూడవ సినిమా.. దర్శకుడు ఎవరో తెలుసా..?
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2021 | 7:56 PM

Share

Vaishnav Tej : ‘ఉప్పెన’ సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ‘ఉప్పెన’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ చక్కటి నటనతో మంచి మార్కులు కొట్టేసాడు. ఇక ఈ యంగ్ హీరో మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఓ సినిమాను పూర్తి చేసిన విషయం అందరికి తెలుసిందే.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ ఓ సినిమా చేసాడు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసాడు క్రిష్. ఈ మూవీలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అచ్చమైన పల్లెటూరి కథగా ఈ చిత్రాన్నితెరకెక్కించాడు క్రిష్. ఇక వైష్ణవ్ ఫస్ట్ ఫిలిం ‘ఉప్పెన’ రిలీజ్ అయ్యింది.. మరి కొద్దిరోజుల్లో ఈ సినిమా హడావిడి అయిపోతుంది.. ఆతర్వాత క్రిష్ సినిమా నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా గురించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైష్ణవ్ తన మూడో సినిమా అక్కినేని వారి బ్యానర్ లో చేయబోతున్నాడని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమాలో వైష్ణవ్ నటించబోతున్నాడని ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు నూతన దర్శకుడు పృథ్వి  డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు.  జులై నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు వెల్లడించనున్నారని తెలుస్తుంది. మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్న ఈ మెగాహీరో జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు..

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై చర్యకు యోచన, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, 6 వారాల గడువునిచ్చిన న్యాయస్థానం