Mahesh Babu : దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్.. ఎందుకు వెళ్ళాడో తెలుసా..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. కాగా మహేష్.. అక్కడ షూటింగ్ను పరిగెత్తిస్తూనే
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. కాగా మహేష్ అక్కడ షూటింగ్ను పరిగెత్తిస్తూనే… దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ను విజిట్ చేశాడు. ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్ అయిన దుబాయ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న టెక్నాలజీని చూసి మహేష్ ఆశ్చర్యపోయాడట. ఇక దీనికి సంబంధించిన వీడియో గల్ఫ్ టుడే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక ‘సర్కారు వారిపాట’ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి బయటకు తెలిసేలా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్నాడు. ఇక ఈ సినిమా గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా కాస్త ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమానుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Chakra Movie Review : సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన విశాల్ ‘చక్ర’.. ఆకట్టుకున్న సినిమా..