AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘నా పాటతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 150 కోట్ల బిజినెస్ జరిగిందన్నారు..’

ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కోసం చంద్రబోస్ ఆలపించిన ‘బడ్జెట్ పద్మనాభం’లోని పాట అనుకోకుండా వైరల్ అయింది. ఈ పాట వారి ఏజెంట్లలో స్ఫూర్తిని నింపి, ఆ సంస్థకు అదనంగా రూ. 150 కోట్ల వ్యాపారం రావడానికి కారణమైంది. వ్యక్తిగత ఎదుగుదలకు, పోరాటానికి ఈ పాట ఎంతగానో దోహదపడిందని ఆయన వెల్లడించారు.

Tollywood: 'నా పాటతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 150 కోట్ల బిజినెస్ జరిగిందన్నారు..'
Chandrabose
Ravi Kiran
|

Updated on: Jan 28, 2026 | 3:00 PM

Share

టాలీవుడ్ గేయ రచయిత చంద్రబోస్ తాను రచించిన ఒక పాట ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాపారంపై ఊహించని ప్రభావాన్ని ఎలా చూపిందో గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఒకానొక సందర్భంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తమ ఏజెంట్ల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించమని చంద్రబోస్‌ను ఆహ్వానించింది. ఆ కార్యక్రమంలో ఆయన తన ఇతర పాటలతో పాటు, 1999లో విడుదలైన ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమాలో తాను రాసిన “ఎవరెమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే” అనే పాటను ప్రత్యేకంగా ఆలపించారు.

ఇది చదవండి: హీరోయిన్లు అందరూ శోభన్ ‌బాబు దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడేవారంటే.? అసలు విషయాన్ని చెప్పిన జయసుధ

అప్పటివరకు ఈ పాట అంతగా ప్రజాదరణ పొందలేదు. అయితే, ఈ కార్యక్రమంలో చంద్రబోస్ ఈ పాటను పాడినప్పుడు, అక్కడున్న కొందరు తమ సెల్‌ఫోన్లలో దానిని రికార్డు చేసి తమ గ్రూపులలో పంచుకున్నారు. అలా ఆ పాట నెమ్మదిగా వ్యాపించి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అనూహ్యంగా, ఆ పాట విపరీతంగా వైరల్ అయింది. దీని ఫలితంగా, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు స్వయంగా చంద్రబోస్‌ను సంప్రదించి, ఆ ఒక్క పాట ద్వారా తమ ఏజెంట్లు అదనంగా రూ. 150 కోట్ల వ్యాపారం సాధించారని తెలిపారు. ఈ పాట వారి నరనరాల్లో జీర్ణించుకుపోయి, అద్భుతమైన ప్రేరణను అందించిందని వెల్లడించారు. లాభం లేని విషయాన్ని వారు ఊరికే చెప్పరని చంద్రబోస్ అన్నారు.

ఈ పాట వెనుక ఉన్న తన వ్యక్తిగత స్ఫూర్తిని చంద్రబోస్ పంచుకున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటూ సుఖ జీవితం గడుపుతున్నప్పటికీ, సినీ రంగంలో గేయ రచయితగా స్థిరపడాలని తపన పడ్డాను. ఆ ప్రయత్నంలో చాలా అవరోధాలు, అవమానాలను ఎదుర్కొన్నాను. సన్నగా, చిన్నగా ఉండే తనను, పాలిథిన్ కవర్‌లో పుస్తకాలు పట్టుకుని వెళ్తున్న తనను చూసి “నువ్వు రాస్తావా? వెళ్లు, మాకు చాలా మంది రాసేవాళ్లు ఉన్నారు” అంటూ తిరస్కరించేవారు. ఇలాంటి అవమానకరమైన పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని, తిరిగి ఇంటికొచ్చి తను ఎంచుకున్న మార్గం సరైనదేనా అని ఆలోచించేవారు. వంద అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఈ ఇండస్ట్రీ వైపు చూడకూడదని నిర్ణయించుకున్నాను. అయితే, 21 అవమానాల తర్వాత, తిరస్కారాలు కాస్తా సన్మానాలుగా, బహుమానాలుగా మారడం ప్రారంభించాయని ఆయన వివరించారు.

ఇది చదవండి: ‘తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..’

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..