Puri Jagannadh: పూరిని ఇంకా వీడని లైగర్ చిక్కులు.. ఫిల్మ్చాంబర్ ఎదుట ఎగ్జిబిటర్ల ఆందోళన
పాపం పూరి. లైఫ్ ఫస్ట్ టైమ్ ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలోని పెద్దల వద్ద ఉన్న ఇష్యూ ఇప్పుడు రోడ్డుకు ఎక్కింది. లైగర్ సినిమా నిజాం ఏరియా ఎగ్జిబిటర్లు ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్తో బౌన్స్ బ్యాక్ అయిన డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్ట్స్ సినిమా అవ్వడంతో లైగర్పై ఓ రేంజ్లో బజ్ పెరిగింది. అందులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండను ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా ద్వారా లాంచ్ చేయడానికి ప్రయత్నించారు. కరణ్ జోహార్ ఒక ప్రొడ్యూసర్గా ఉండటంతో.. సినిమాకు బాలీవుడ్లో కూడా కావాల్సినంత స్పాన్ దక్కింది. కానీ రిజల్ట్స్ మాత్రం అనుకున్నట్లు రాలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫిల్మ్.. తీవ్ర నష్టాలను చవిచూసింది. ఇటు ప్రొడ్యూసర్స్కు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తీసుకు వచ్చింది.
‘లైగర్’ కోసం చేసిన అప్పులు, అగ్రిమెంట్లు దర్శకుడు పూరిని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. తమ నష్టాలు పూడ్చుకోవడనికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా దర్శక నిర్మాత అయిన పూరిపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఇదే ఇష్యూకు సంబంధించి పూరికి సంబంధించి ఓ వాయిస్ లీకయ్యింది. తాను డబ్బులు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేకపోయినా బయ్యర్లు నష్టపోయారని తిరిగి ఇవ్వడానికి అంగీకరించానని, ఒక నెలలో ఇస్తానని చెప్పినా.. అతి చేసి ధర్మా చేస్తానంటూ తనను బెదిరించారని పూరి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ ఇష్యూ సెటిల్ అయిందనే అందరూ అనుకున్నారు.
కానీ తాజాగా లైగర్ సినిమా నైజాం ఏరియా ఎగ్జిబిటర్ల ఆందోళనకు దిగారు. ఫిల్మ్చాంబర్ ఎదుట లైగర్ బాధితులు రిలే దీక్షకు పూనుకున్నారు. లైగర్ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమను ఆదుకునే వరకు పోరాటం చేస్తామని చెబుతున్నారు. గతంలో ధర్నా చేసిన వాళ్లకు కాకుండా నష్టపోయిన వాళ్లకు డబ్బులు ఇస్తానన్న పూరీ.. ఆ హామీనైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. సిట్యువేషన్ చేయి దాటినట్లే అనిపిస్తుంది. మరి దీనిపై పూరి క్యాంప్ నుంచి ఏం ఆన్సర్ వస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..