Asha Bhosle : ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. షాక్లో సినీ ఇండస్ట్రీ
ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబసభ్యులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె ప్రస్తుతం అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స అందించారు. అయినప్పటికీ పరిష్టితి విషమించడంతో ఆమె కన్నుమూశారు.

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబసభ్యులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె ప్రస్తుతం అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స అందించారు. అయినప్పటికీ పరిష్టితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. ఆశా భోస్లే 1000కి పైగా సినిమాల్లో పాటలు ఆలపించారు. ఎక్కువగా ఆమె బాలీవుడ్ లోనే పాటలు పాడారు. ఆశా భోస్లే మరణ వార్త తెలిసి సిని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆశా భోస్లే లతా మంగేష్కర్ సోదరి. 2022 ఫిబ్రవరి 6 లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి శేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్. గాయనిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు ఆశా. అంతే కాదు ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు అందుకున్నారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




