AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు, జిజాన్ నగరాల్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సదుపాయాలను దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!
Attack On Saudi Arabia
Balaraju Goud
|

Updated on: Jul 26, 2026 | 7:26 AM

Share

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు, జిజాన్ నగరాల్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సదుపాయాలను దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఒక ప్రకటనలో వెల్లడించారు. హోడెయిడా నగరంపై సౌదీ అరేబియా ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు హౌతీలు పేర్కొన్నారు.

శనివారం (జూలై 25) తెల్లవారుజామున యాన్బు, జిజాన్ ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగినట్లు సౌదీ పౌర రక్షణ విభాగం తెలిపినా, దాడుల ప్రభావంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ఇదే సమయంలో ఇరాన్‌లో ఎలాంటి కొత్త వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం రాకపోవడం గమనార్హం. దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న అమెరికా దాడులకు తాత్కాలిక విరామం లభించినట్లు తెలుస్తోంది.

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు బాబ్ అల్-మండేబ్ జలసంధిని సౌదీ నౌకలకు మూసివేస్తామని హౌతీలు హెచ్చరించారు. యెమెన్‌పై సౌదీ నేతృత్వంలోని దిగ్బంధనం, సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హౌతీల సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధిపతి మహ్దీ అల్-మషత్ మాట్లాడుతూ, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, దాడులను నిలిపివేయడం తప్ప మరో పరిష్కారం లేదని స్పష్టం చేశారు.

ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం సరుకు రవాణా, కంటైనర్ రవాణాలో దాదాపు నాలుగో వంతు బాబ్ అల్-మండేబ్ మార్గం ద్వారానే సాగుతుంది. దీంతో అక్కడ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎర్ర సముద్రంలో రెండు సౌదీ చమురు ట్యాంకర్లను హౌతీలు లక్ష్యంగా దాడి చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు హోడెయిడా ప్రాంతంలోని హౌతీ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. అయితే ఓడరేవును లక్ష్యంగా చేసుకోలేదని, వాణిజ్య నౌకలకు ముప్పుగా ఉన్న సైనిక కేంద్రాలనే ధ్వంసం చేశామని వెల్లడించింది. హౌతీల ఆరోగ్య శాఖ ప్రకారం ఆ దాడుల్లో ఇద్దరు గాయపడ్డారు.

మరోవైపు, యుద్ధానికి బదులుగా దౌత్యం, చర్చల ద్వారానే యెమెన్ సంక్షోభానికి పరిష్కారం సాధ్యమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పేర్కొన్నారు. ఇదే సమయంలో కాస్పియన్ సముద్రంలో ఇరాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి జరిపిందని తెహ్రాన్ ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించింది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానుండటం ఈ ప్రాంత భద్రతా పరిస్థితులకు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలపై అంతర్జాతీయ ఆందోళన పెరుగుతోంది.

అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us