Kriti Sanon: నా తప్పుంటే నేను వెంటనే సారీ చెప్తా.. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి..రిలేషన్షిప్ గురించి కృతిసనన్
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.
బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది ఈ చిన్నది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఆ సినిమా కూడా నిరాశపరిచింది.
ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రిలేషన్ లో ఉందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా కృతిసనన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె రిలేషన్ షిప్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. రిలేషన్ షిప్లో గొడవలు చాలా కామన్ అని అంటోంది కృతిసనన్. అలాగే ఆమె మాట్లాడుతూ..
ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే
రిలేషన్షిప్ లో చిన్న చిన్న గొడవలు జరగడం చాలా కామన్. గొడవలు ఎదో రకంగా జరుగుతూనే ఉంటాయి. అయితే గొడవ జరిగినప్పుడు అందులో నా తప్పు ఉంటే తప్పకుండా నేనే ముందు సారీ చెబుతా. లేకపోతే అస్సలు సారీ చెప్పను అని తెలిపింది. సారీ చెప్పకపోయినా దాన్ని ఎదో రకంగా సాల్వ్ చేయాలనుకుంటా.. అంటే తప్ప దాన్ని పెద్దది చేయాలనుకొను.. ఆ సమస్యను అలాగే వదిలేయడం కూడా నాకు ఇష్టం లేదని కృతిసనన్ చెప్పుకొచ్చింది. అలాగే ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా.? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘నాకు కన్నీళ్లు రావని నేను చెప్పను.. అలాగే అస్సలు ఏడవనని కూడా చెప్పను. అలా అని ప్రతీ చిన్న విషయానికీ ఏడవను. ఎక్కువగా బాధ వచ్చినప్పుడు తట్టుకోలేక ఏడ్చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎవరితోనైనా గొడవ పడితే.. నాకు వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయి అని చెప్పుకొచ్చింది కృతిసనన్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.