సినీరంగంలో చాలామంది హీరోయిన్ డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు.. మరికొందరు మాత్రం ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అందం, అభినయంతో వెండితెరపై తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, ఐశ్వర్య లక్ష్మి, శ్రీలీల, ఆషికా రంగనాథ్, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్స్ మెడికల్ రంగంలోకి అడుగుపెట్టినవారే. కానీ ఓ తెలుగమ్మాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న హీరోయిన్ కూడా డాక్టరే. తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏంటీ ఈ అమ్మాయి డాక్టరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే తెలుగమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. తెలుగు సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్.
సాయి కామాక్షి భాస్కర్ల అచ్చ తెలుగమ్మాయి. చైనాలో ఎంబీబీఎస్ చేసి.. అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లుగా డాక్టర్ గా పనిచేసింది. 2018లో మిస్ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. పాత్ర ప్రాధాన్యత, విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 మూవీస్ ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది సాయి కామాక్షి. ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ చేసి అలరించింది. ఈ అమ్మడు ఎక్కువగా ఢీగ్లామర్ రోల్స్ చేసింది. కానీ నెట్టింట మాత్రం అందుకు విభిన్నం. గ్లామర్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.