Kanulu Knulanu Dhochaayante: ‘కనులు కనులను దోచాయంటే’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే తెలుగులో అంతకు ముందే కనులు కనులను దోచాయంటే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కేఎఫ్సీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కమలాకర్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, డా. రవికిరణ్ విడుదల చేశారు.

Kanulu Knulanu Dhochaayante: 'కనులు కనులను దోచాయంటే' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Actress
Follow us

|

Updated on: Aug 24, 2024 | 4:27 PM

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో దుల్కర్ సల్మా్న్ ఒకరు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంతోపాటు తమిళం, తెలుగు భాషలలో హీరోగాను క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్.. ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే తెలుగులో అంతకు ముందే కనులు కనులను దోచాయంటే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కేఎఫ్సీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కమలాకర్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, డా. రవికిరణ్ విడుదల చేశారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. సెకండ్ హీరోగా రక్షణ్ కనిపించాడు. అలాగే రీతూ వర్మ స్నేహితురాలిగా నిరంజనీ అహతియాన్ కనిపించింది. ఇద్దరు హీరోలను బురిడి కొట్టించే అమ్మాయిలుగా కనిపించారు రీతూ వర్మ, నిరంజనీ అహతియాన్. అయితే ఈ మూవీ తర్వాత రీతూ వర్మ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉండగా.. నిరంజనీ పేరు అంతగా వినిపించలేదు. ఈ అమ్మాయి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అగస్త్యన్ కుమార్తె నీరంజని. ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు అగస్త్యన్. తెలుగుతోపాటు హిందీలోనూ అలరించాడు. ఇక తెలుగులో రవితేజ, సంగీత, వాణి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాను తెరకెక్కించాడు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ అగస్త్యన్ కు ముగ్గురు కూతుళ్లు. అందులో చివరి అమ్మాయి నిరంజనీ. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ ఫ్యాషన్ స్టైలిష్ట్. నళిని శ్రీరామ్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర వర్క్ చేసిన అనుభవంతో ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. దుల్కర్ సల్మాన్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. నజ్రియా, దుల్కర్ కలిసి నటించిన వాయు ముడు పెసవం సినిమాతో స్టైలిస్ట్ గా మారింది. సిగరం తోడు, త్రిష ఇల్లానా నయనతార, కథాకలి, పెన్సిల్, కబాలి, భైరవ వంటి చిత్రాలను పనిచేసింది. 2020లో వచ్చిన కనులు కనులను దోచాయంటే సినిమాతో నటిగా మారింది. ఈ సినిమా సమయంలోనే డైరెక్టర్ దేసింగ్ పెరియస్వామితో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు వీరిద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం నిరంజనీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.