AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమాకు రూ. 200 కోట్లు.. ఇండియాలోనే కాస్ట్లీ విలన్.. అతను ఎవరంటే

సాధారణంగా సినిమాల్లో హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సినిమాల్లో విలన్‌గా నటించే వారికీ అత్యధిక పారితోషికం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు.. ఈ సందర్భంలో, కొత్త సినిమాలో విలన్ పాత్రలో నటించినందుకుఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరో తెలుసా.?

ఒక్క సినిమాకు రూ. 200 కోట్లు.. ఇండియాలోనే కాస్ట్లీ విలన్.. అతను ఎవరంటే
Hero
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2024 | 8:40 AM

Share

ఇండియన్ సినిమాల్లో హీరోలుగా నటించే వారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. హీరోయిజంతోనే కాదు కొంతమంది విలనిజంతోనూ మెప్పిస్తున్నారు. చాలా మంది హీరోలు విలన్ గా చేసి మెప్పిస్తున్నారు. విజయ్ సేతుపతి లాంటి బడా హీరో మాస్టర్, విక్రమ్ వేద,  జవాన్ వంటి చిత్రాలలో విలన్‌గా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత నటుడు కమల్ హాసన్ కూడా  ప్రభాస్ ఇటీవల విడుదలైన కల్కి చిత్రంలో విలన్ గా కనిపించారు. ఈ పద్ధతిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఎందరో ప్రముఖ నటీనటులు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. దాంతో ఇప్పుడు విలన్ రోల్స్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది.ఒక్కసారి విలన్ గా మారితే ఆఫర్స్ పెరుగుతున్నాయి. క్రేజ్ మారిపోతుంది. ఇక ఇప్పుడు ఓ విలన్ ఏకంగా రూ. 200కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

విలన్ రోల్ చేయడానికి 200 కోట్లు ఇస్తున్న మొదటి నటుడు ఎవరో తెలుసా? అతను ఎవరో కాదు రాకింగ్ స్టార్ యష్. ఒకే ఒక్క సినిమాతో యష్ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. కెజిఎఫ్ సినిమాతో అన్ని భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు యష్. బుల్లితెరలో నటించిన తర్వాత యష్ హీరోగా మారాడు. మొదట్లో టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన అతను 2007లో కన్నడ చిత్రం జంపత హుడుకిలో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా తర్వాత హీరోగా  నటించిన ఆయన కన్నడ సినిమాల్లోనే అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత యష్ ను ఇండియాలో పాపులర్ చేసిన సినిమా “కెజిఎఫ్”.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 2018లో భారీ స్పందన లభించింది. ఈ సినిమా తరువాత,కేజీఎఫ్ చాప్టర్ 2 2023 లో విడుదలైంది అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం తరువాత,యష్   హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నాడు. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహించిన రామాయణంలో రావణుడి పాత్రలో నటించనున్నాడు యష్. ఈ చిత్రంలో ఆయన రావణుడిగా నటిస్తున్నారని, ఈ సినిమాలో నటించేందుకు దాదాపు 200 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో రాముడిగా రంబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!